TDP : అసెంబ్లీలో ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు సమస్య లపై చర్చించాలి. అధికార పక్షం లో ఉన్న వారిని ప్రతి పక్షంలో ఉన్న వారు ప్రశ్నించాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రతి పక్షం వారు అధికార పక్షాన్ని నిలదీయాలి. అప్పుడే అది ఒక మంచి రాజకీయ వ్యవస్థ అవుతుంది, ఆ సమయంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అసెంబ్లీలో కూడా రాజకీయం చేస్తాం.. రాజకీయ లబ్ధికి అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటాం అని చూస్తే అది ఖచ్చితంగా క్షమించరాని నేరం అవుతుంది అంటూ రాజ్యాంగంలోనే పేర్కొనడం జరిగింది.రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది అంటూ కొందరు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం,
ఇష్టానుసారంగా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారా అది ప్రజలకు అన్యాయం చేయడం అవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని కొందరు సీనియర్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు శపథం చేసి తాను అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ సమావేశాలకు దూరంగా ఉన్నాడు.ఇప్పుడు ఆయన పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు చాలా పెండ్డింగ్ లో ఉన్నాయి. ప్రజలకు అవసరమైన బిల్ లు పాస్ చేయాల్సి ఉన్నవి.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకుల వ్యవహారం వల్ల ప్రజలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందడం లేదు అంటూ వైకాపా విమర్శిస్తోంది. సభా కార్యక్రమాలకు అడ్డు రావడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకుల సస్పెండ్ పై ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ సభా కార్యక్రమాలను దురుద్దేశంతో అడ్డుకునే వారిని సస్పెండ్ చేయడంలో తప్పులేదు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.