Ys jagan , KCR జగన్, కేసీఆర్.. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అందులోనూ మొదట్లో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. జగన్.. హైదరాబాద్ వచ్చి.. ప్రగతి భవన్ లో విందులో పాల్గొని కేసీఆర్ తో ముచ్చటించి మరీ ఏపీకి వెళ్లేవారు. కేసీఆర్ కూడా జగన్ తో మంచిగానే ఉండేవారు. కానీ.. తర్వాత వాళ్లిద్దరికీ చెడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ముందుగా తెలంగాణ వచ్చి సీఎం కేసీఆర్ ను కలిశారు. అప్పుడు ఇద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలో.. ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించాలో డిస్కస్ చేశారు. తెలుగు రాష్ట్రాలను ఎక్కడికో తీసుకెళ్దాం అని అనుకున్నారు. కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు.
అప్పట్లో ఏపీలో నిర్మించిన.. నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ కానీ.. సీఎం కేసీఆర్ గానీ అభ్యంతరం చెప్పలేదు. అలాగే.. తెలంగాణలో నిర్మించిన.. నిర్మిస్తున్న ప్రాజెక్టులపై జగన్ మోహన్ రెడ్డి కానీ.. ఏపీ కానీ అభ్యంతరం చెప్పలేదు. కానీ.. తర్వాత తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడం.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడం ప్రారంభించారు.
చివరకు వీళ్లిద్దరి గొడవ.. కేంద్రం దాకా వెళ్లింది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చేయడం.. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఆరోపణ చేయడం.. అక్కడితో ఆగకుండా.. కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేయడంతో.. ప్రస్తుతం కేంద్రమే ఇక రంగంలోకి దిగింది. అసలు.. తెలంగాణ, ఏపీలో ఏం ప్రాజెక్టులు కడుతున్నారు. ఎన్ని కడుతున్నారు. వాటికి సంబంధించిన డీపీఆర్ లను వెంటనే కేంద్రానికి సమర్పించాలంటూ కేంద్రం రెండు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి.. డీపీఆర్ లను సమర్పిస్తే.. కేంద్రం నుంచి చాలా సమస్యలు వస్తాయి. అది రెండు రాష్ట్రాలకూ సమస్యే. ఈ సమయంలో కేసీఆర్, జగన్ ఏం చేస్తారు. ఇద్దరూ కాంప్రమైజ్ అయిపోతారా? లేక అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ లను సమర్పించి.. కేంద్రానికి సరెండర్ అవుతారా? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.