
Viral News : నిజం నిప్పులాంటిది.. ఎప్పుడైన భయపడకుండా ఉండదు. ఓ తండ్రి తన కొడుకుది సహజమరణం కాదని.. ఏదో మిస్టరీ దాగుందని అనుమానించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఊహించని నిజాలుతెలిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అక్బర్ ఆజాం మర్డర్ మిస్టరీ వీడింది. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలే వెలుగుచూశాయి. మత్తుమందును ఎక్కువ డోసులో ఇవ్వడం వల్లే అతను చనిపోయినట్టు నిర్ధారించారు. కట్టుకున్న భార్యే అతణ్ని కడతేర్చినట్టు తేల్చారు పోలీసులు.
భార్య అహ్మదున్నీసా బేగంతో పాటు, ఆమెకు సహకరించిన మరో ఇద్దరు నిందితులను కటకటాల్లోకి పంపారు. ఈ ఏడాది జూన్ 23న అజాం చనిపోయాడు. అంటే ఘటన జరిగి రెండు నెలలు కావస్తోంది. అప్పుడంతా అతనిది సహజ మరణంగానే భావించారు. అలా నమ్మించడంలో అప్పటికి సక్సెస్ అయ్యారు నిందితులు. మామూలుగానే అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ, ఆ తర్వాత అజాం తండ్రి హుస్సేన్కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇది మామూలు మరణం కాదనీ… ప్రి ప్లాన్డ్ మర్డర్ అని నిర్ధారించారు పోలీసులు. కోడలు.. తమ అపార్ట్ మెంట్లోనే ఉండే రాజేష్ జైన్, కిరణ్ అనే యువకులతో మాట్లాడిన మాటలు ఫోన్లో రికార్డయ్యాయి. దీంతో ఆరా తీయగా..
Viral News Whatsapp Chat Helps Unearth Andhra Public Prosecutor
అహ్మదున్నీసా బేగంకు వాళ్లిద్దరితో ఎఫైర్ ఉన్నట్లు తేలిసింది. తమ సుఖానికి అడ్డొస్తున్నాడనే కోపంతో.. జూన్ 23న అక్బర్ ఆజాంకు నిద్రమాత్రలు ఇచ్చింది. అతను నిద్రలోకి జారుకోగానే.. కిరణ్ ను పిలించింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్లకార్ క్లోరోఫామ్ తెచ్చిన కిరణ్.. అక్బర్ ఆజాం ముక్కుకు అదిమిపట్టుకున్నాడు. దీంతో అతడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఈ మర్డర్ కు రాజేష్ జైన్ బయట నుంచి కాపలా కాశాడు. పోలీసులు అహ్మదున్నీసాతో పాటు రాజేష్, కిరణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించాడు. అక్రమ సంబంధం కోసమే భర్తను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది .59 రోజుల తర్వాత మర్డర్ మిస్టరీని ఛేదించిన కాకినాడ ఖాకీలు… అహ్మదున్నీసా, కిరణ్, రాజేష్ జైన్లను కటకటాల వెనక్కి నెట్టారు
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
This website uses cookies.