
who will be the new chairman to ttd
TTD CHAIRMAN: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి త్వరలో కొత్త చైర్మన్ రానున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో పది రోజుల్లో (ఈనెల 21న) పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన్నే కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయమేంటో తెలియదు గానీ ఆయనకు మాత్రం ఎంపీ కావాలనే కోరిక గతంలో బలంగా ఉండేది. 2019 లోక్ సభ ఎలక్షన్ లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి బరిలో నిలవాలని గట్టిగా భావించినా కుదరలేదు. దీంతో ఆయన కొన్నాళ్లు కినుక వహించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటంతో పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో మళ్లీ క్రియాశీలకం అయ్యారు.
who will be the new chairman to ttd
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఆయన స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఒకసారి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. త్వరలో పునర్వ్యవస్థీకరించనున్న ఏపీ కేబినెట్ లో భూమన కరుణాకర్ రెడ్డికి బెర్త్ ఇచ్చే ఛాన్స్ లేకపోవంతో టీటీడీ చైర్మన్ గా రెండోసారి నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెబుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్సార్సీపీలో మంచి పేరుంది. అనాథ కరోనా శవాలకు సొంత డబ్బులతో తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించినందుకు ఆయన్ని రీసెంటుగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా మెచ్చుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. పైగా ఆయన గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పెద్దగా వివాదాలేమీ తలెత్తలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టీటీటీ ఛైర్మన్ పోస్ట్ భూమన కరుణాకర్ రెడ్డికే సెంట్ పర్సెంట్ దక్కనుందని తేల్చిచెబుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటులోని పెద్దల సభ(రాజ్యసభ)కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో త్వరలో ఖాళీలు ఏర్పడనుండటం, ఆయన కూడా ఢిల్లీకి వెళ్లేందుకు ఉత్సాహంగా ఉండటంతో పదోన్నతి ఖాయమని సమాచారం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి అందులో పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. వయసులో పెద్దవాడు. కాబట్టి పెద్దల సభకు పంపటం సముచితంగా ఉంటుందనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటగా పేర్కొంటున్నారు.
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
This website uses cookies.