
who will be the new chairman to ttd
TTD CHAIRMAN: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి త్వరలో కొత్త చైర్మన్ రానున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో పది రోజుల్లో (ఈనెల 21న) పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన్నే కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయమేంటో తెలియదు గానీ ఆయనకు మాత్రం ఎంపీ కావాలనే కోరిక గతంలో బలంగా ఉండేది. 2019 లోక్ సభ ఎలక్షన్ లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి బరిలో నిలవాలని గట్టిగా భావించినా కుదరలేదు. దీంతో ఆయన కొన్నాళ్లు కినుక వహించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటంతో పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో మళ్లీ క్రియాశీలకం అయ్యారు.
who will be the new chairman to ttd
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తి కానుండటంతో ఆయన స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఒకసారి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. త్వరలో పునర్వ్యవస్థీకరించనున్న ఏపీ కేబినెట్ లో భూమన కరుణాకర్ రెడ్డికి బెర్త్ ఇచ్చే ఛాన్స్ లేకపోవంతో టీటీడీ చైర్మన్ గా రెండోసారి నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెబుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్సార్సీపీలో మంచి పేరుంది. అనాథ కరోనా శవాలకు సొంత డబ్బులతో తన చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించినందుకు ఆయన్ని రీసెంటుగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా మెచ్చుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. పైగా ఆయన గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు పెద్దగా వివాదాలేమీ తలెత్తలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే టీటీటీ ఛైర్మన్ పోస్ట్ భూమన కరుణాకర్ రెడ్డికే సెంట్ పర్సెంట్ దక్కనుందని తేల్చిచెబుతున్నారు.
వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటులోని పెద్దల సభ(రాజ్యసభ)కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఎగువ సభలో త్వరలో ఖాళీలు ఏర్పడనుండటం, ఆయన కూడా ఢిల్లీకి వెళ్లేందుకు ఉత్సాహంగా ఉండటంతో పదోన్నతి ఖాయమని సమాచారం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి అందులో పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. వయసులో పెద్దవాడు. కాబట్టి పెద్దల సభకు పంపటం సముచితంగా ఉంటుందనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటగా పేర్కొంటున్నారు.
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.