Brush | రాత్రిపూట బ్రష్ చేయకపోతే దంతాలకు ప్రమాదం.. ఎయిమ్స్ వైద్యుల హెచ్చరిక

Authored By Sam C | The Telugu News | Updated on : 5 November 2025, 3:27 pm

Brush | శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, నోటి ఆరోగ్యానికీ అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, ఇంతకంటే తీవ్రమైన నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ (AIIMS) న్యూఢిల్లీలోని దంత విభాగ నిపుణురాలు డాక్టర్ బందన పి. మెహతా హెచ్చరించారు.

#image_title

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం బ్రష్ చేయడం మంచిదే అయినా, రాత్రిపూట బ్రష్ చేయడం మరింత అవసరం. కారణం – రోజంతా తిన్న ఆహారం ముక్కలు దంతాల మధ్య ఇరుక్కుపోతాయి. రాత్రి నిద్ర సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవడం వలన నోటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఈ బ్యాక్టీరియా ఆహార కణాలను పాకిస్తూ రాత్రంతా దంతాలపై దాడి చేస్తాయి. ఫలితంగా దంతక్షయం, దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె చెప్పారు.

డాక్టర్ మెహతా సూచించిన ముఖ్య చిట్కాలు ఇవీ:

* ప్రతిరోజూ కనీసం రెండు నిమిషాలపాటు బ్రష్ చేయాలి.
* తిన్న తర్వాత కనీసం అరగంట విరామం ఇచ్చి బ్రష్ చేయాలి.
* మృదువైన బ్రిస్టల్స్ ఉన్న బ్రష్ ఉపయోగించాలి.
* ఫ్లాస్, మౌత్‌వాష్‌లను నోటి పరిశుభ్రత కోసం వాడాలి.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి