Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మహిళ.. భర్త ఇచ్చిన పనిష్మెంట్పై ప్రశంసలు
ప్రధానాంశాలు:
Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మహిళ.. భర్త ఇచ్చిన పనిష్మెంట్పై ప్రశంసలు
Woman : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భర్తలని మబ్బిబెట్టి ప్రియుడితో జల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే భర్త పిల్లలు అడ్డుగా ఉన్నారని వారిని చంపేందుకు కూడా వెనకాడడం లేదు. అయితే తాజాగా ఓ వివాహిత వివాహేతర సంబంధం బయటపడింది. దానికి భర్త ఆగ్రహావేశాలకి లోను కాకుండా ఇచ్చిన పనిష్మెంట్ మాత్రం వారికి దిమ్మతిరిగేలా చేసింది.

Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మహిళ.. భర్త ఇచ్చిన పనిష్మెంట్పై ప్రశంసలు
Woman భలే శిక్ష..
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆమె భర్త వారిని అడ్డగించాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్రహంతో ఊగిపోకుండా తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని నీళ్లతో కడిగి తొలగించాడు. ఆ తర్వాత, ఇంకా పెద్ద షాకిస్తూ, ఆమె ప్రియుడి చేత మళ్లీ తన భార్య నుదుటిపై సింధూరాన్ని దిద్దించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, మహిళ నుదుటిపై సింధూరం పెడితే పెళ్లయినట్లుగా భావిస్తారు.
అయితే భర్తకి దొరికిన తర్వాత భార్య ముఖం అవతలికి తిప్పుకొని ఉంది. భర్త చేసిన పనిని చాలా మంది సమర్థించారు. ప్రియుడు ఆమె కలిసి ప్లాన్ చేసి మొగుడిని చంపే కంటే ముందే మేల్కొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మంచి పని చేశావ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. పెళ్లి చేసి ఆమె భర్త మంచి పని చేసి దరిద్రాన్ని వదిలించుకున్నాడని మరో నెటిజన్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. ఆమెతో డైవర్స్ తీసుకుని శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకో అంటూ ఆ భర్తకు నెటిజన్లు సలహాలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైన ఈ మధ్య కొందరు మహిళలు మరీ దారుణంగా వ్యవహరిస్తుండడం చూసి సమాజం ఎటు పోతుందా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.