Woman : ఇద్ద‌రు సోద‌రుల‌ని పెళ్లి చేసుకున్న ఒక మ‌హిళ‌.. గ్రాండ్‌గా వివాహం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Woman : ఇద్ద‌రు సోద‌రుల‌ని పెళ్లి చేసుకున్న ఒక మ‌హిళ‌.. గ్రాండ్‌గా వివాహం..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Woman : ఇద్ద‌రు సోద‌రుల‌ని పెళ్లి చేసుకున్న ఒక మ‌హిళ‌.. గ్రాండ్‌గా వివాహం..!

Woman : హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో షిల్లై గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి , కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు, సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ సంప్రదాయాన్ని “జోడిదరన్” లేదా “ద్రౌపది ప్రథ” అని పిలుస్తారు. ఈ సంప్రదాయంలో ఒక మహిళను ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరుల్ని వివాహం చేసుకోవచ్చు. ఈ వివాహం జూలై 12-14 మధ్యలో మూడు రోజుల పాటు జరిగింది.

Woman ఇద్ద‌రు సోద‌రుల‌ని పెళ్లి చేసుకున్న ఒక మ‌హిళ‌ గ్రాండ్‌గా వివాహం

Woman : ఇద్ద‌రు సోద‌రుల‌ని పెళ్లి చేసుకున్న ఒక మ‌హిళ‌.. గ్రాండ్‌గా వివాహం..!

Woman  ఇదొక సంప్ర‌దాయం..

ఈ వివాహం పూర్తి సమ్మతితో జరగిందని సునీతా చౌహాన్ తన నిర్ణయం స్వచ్ఛందంగా తీసుకున్నానని చెప్పారు. వారు ఉన్నత విద్యావంతులు. ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి, కపిల్ నేగి విదేశాల్లో హాస్పిటాలిటీ రంగంలో పనిచేస్తున్నాడు. వారు భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ, ఈ వివాహం ద్వారా కుటుంబ ఐక్యత, సంప్రదాయాన్ని కాపాడుకున్నామని చెబుతున్నారు.

ఈ సంప్రదాయం మహాభారతంలోని ద్రౌపది పాత్రతో సంబంధం కలిగి ఉందని, ఆమె ఐదుగురు పాండవులను వివాహం చేసుకున్నట్లు చెబుతారు సంప్రదాయం ట్రాన్స్-గిరి ప్రాంతంలో, ముఖ్యంగా సిర్మౌర్, కిన్నౌర్, కుల్లూ, లాహౌల్-స్పితి ప్రాంతాలలో సాధారణం. షిల్లై గ్రామంలో దాదాపు 36 కుటుంబాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాయి. అయితే ఆధునికీకరణ, విద్య, ఉద్యోగ అవకాశాలు, చట్టపరమైన నిబంధనల కారణంగా బహుభర్తృత్వం తగ్గుముఖం పడుతోంది. భారతదేశంలో బహుభర్తృత్వం చట్టవిరుద్ధం అయినప్పటికీ, ఈ ప్రాంతంలో సామాజికంగా ఆమోదయోగ్యంగా ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది