Ys Jagan : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఉక్రెయిన్ లో ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి విద్యార్థులు ఉక్రెయిన్ దేశం లో విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ విద్య ఆ దేశంలో తక్కువ ఖర్చు ఉండటంతో ఎక్కువ శాతం మంది అక్కడికి వెళ్తున్నారు. మన ఇండియా నుండి కూడా అత్యధికులు ఉక్రెయిన్ దేశానికి వెళ్లి చదువుకుంటున్నారు. ఎంతో మంది తెలుగు మెడికల్ విద్యార్థులు ఈ సమయం లో అక్కడ చిక్కుకు పోయారు. యుద్ధం వల్ల అక్కడ ఉన్న మన వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమయంలో తెలుగు వాళ్లు ముఖ్యంగా ఏపీకి చెందిన విద్యార్థులు అక్కడ చిక్కుకోవడం తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
యుద్ధం ప్రారంభం కు ముందే ఏపీకి చెందిన విద్యార్థులు అని వెనక్కు వచ్చేయాలని సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశాడు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా నిర్వహించడం జరిగింది. ఏపీ విద్యార్థులను మొత్తం వెనక్కు రప్పించేందుకు జరిగిన ప్రయత్నాలు కొంత మేరకు సఫలమయ్యాయి. యుద్దం మొదలు అవ్వడంతో అక్కడే చిక్కుకుపోయిన వారి విషయంలో కూడా జగన్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.తాజాగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఆ విద్యార్థులకు సంబంధించి సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
సీఎం జగన్ అక్కడ నుండి విద్యార్థులను ఎట్టి పరిస్థితిలో క్షేమంగా వెనక్కు తీసుకు వస్తా అంటూ విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అక్కడే చిక్కుకు పోయిన కొంత మంది విద్యార్థులతో సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు ప్రభుత్వ ప్రతినిధులు కొందరు ప్రత్యక్షంగా మాట్లాడటం కూడా జరిగిందట. వారికి ధైర్యాన్ని ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ అక్కడున్న విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. దాంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని… జగన్ వారిని తీసుకు వస్తారని నమ్మకంతో ఉన్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.