ysrcp groups targeting ap mlc thota trimurthulu
Thota Trimurthulu : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తోట త్రిమూర్తులు thota trimurthulu లేటెస్టుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. దీంతో ఆయన్ని వ్యతిరేకించే సొంత పార్టీలోని నేతలు, ప్రతిపక్ష పార్టీలోని లీడర్లు ఏకమయ్యారు. రెండున్నర దశాబ్దాల కిందటి ఒక వ్యవహారాన్ని తెర మీదికి తెచ్చారు. తోట త్రిమూర్తులు thota trimurthulu అప్పట్లో ఒక ఎస్సీ వ్యక్తికి గుండు కొట్టించినట్లు కేసు నమోదైంది. అది ఆయన్ని ఇప్పటికీ రాజకీయంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. నిన్న గాక మొన్న కూడా అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు అపొజిషన్ పార్టీ లీడర్లు ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించారు. ఎస్సీ ద్రోహికి ఏమిటీ అందలం? అని ప్రశ్నించారు. 25 సంవత్సరాల కిందట పేపర్లలో ప్రింట్ అయిన న్యూస్ క్లిప్పింగులను ప్రదర్శించారు.
ysrcp groups targeting ap mlc thota trimurthulu
రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య అస్సలు పడట్లేదు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కి, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుకి తాజాగా ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులు అంటే పీకల దాకా వ్యతిరేక భావం ఉంది. బోస్ కి, తోటకి మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో తోటను ఓడించింది ఎవరో కాదు. చెల్లుబోయిన వేణే కావటం గమనార్హం. ప్రస్తుతం మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న తోటను రామచంద్రాపురం సెగ్మెంట్ లోకి ఎంటర్ అవ్వకుండా చేసేందుకు పైన చెప్పుకున్న ఇద్దరు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Ys Jagan
ఇదే సమయంలో తోట త్రిమూర్తులు thota trimurthuluను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన మండలికి పదోన్నతి కల్పించటం బోసు, వేణుల పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. ఆ కోపంతోనే వాళ్లిద్దరు ప్రత్యక్షంగా బయటపడకుండా విపక్ష ఎస్సీ నాయకులను మీడియా ముందు పెట్టి తోట మీద దుమ్మెత్తి పోసేలా చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాలకు పదునైన అస్త్రాన్ని ఇచ్చి తోటను పరోక్షంగా టార్గెట్ చేశారని విశ్వసనీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాలిటిక్సులో ఫస్ట్ నుంచే మంచి పేరు లేని తోట thota trimurthuluకు సీఎం వైఎస్ జగన్ ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్సీపీలోని ఒక వర్గం కుతకుతలాడుతోంది.
Ysrcp
తనకు ఎమ్మెల్సీగా మరోసారి పొలిటికల్ లైఫ్ వచ్చిందనే సంతోషం తోట త్రిమూర్తులుకు లేకుండా చేస్తున్న సదరు లీడర్లపై భవిష్యత్తులో ప్రతీకారం తప్పదని ఆయన గ్రూపు హెచ్చరిస్తోంది. ఈ వర్గ విభేదాలు జిల్లా రాజకీయాల పైన, రానున్న అసెంబ్లీ ఎన్నికల పైన ఎఫెక్ట్ చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే ఈ ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.