
ysrcp president ys jagan
Ys Jagan : అధికార పార్టీ అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఈ రెండు పదవుల్లోనూ ఒకే వ్యక్తి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి తలెత్తటం సహజం. ఆ రెండు పోస్టుల మధ్య సమన్వయం సాధించటం అంత ఈజీ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబే ఈ జోడు గుర్రాల బండిని నడపలేక రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీకి ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించి ఉంటే ఇలాంటి చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చేది కాదంటూ బాధపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చాణక్యుడిలా పేరు సంపాదించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కూడా ఈ డబుల్ టాస్క్ ని డీల్ చేయలేక పార్టీ బాధ్యతలను 90 శాతం తన కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి అప్పగించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా తన చేతిలోని బీజేపీ పగ్గాలను జేపీ నడ్డాకి ఇచ్చారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏపీలో వైఎస్ జగన్ సైతం తన పార్టీ(వైఎస్సార్సీపీ)పై ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ తొలిసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజల కోసమే సాధ్యమైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు. సర్కారే సర్వస్వం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీకి దూరమవుతున్నారు. ఫలితంగా పార్టీలోని అంతర్గత కలహాలు అంత తేలిగ్గా పరిష్కారం కావట్లేదు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 30 నుంచి 40 చోట్ల ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేకి, పార్టీ ఇన్ఛార్జ్ కి మధ్య పడట్లేదు. పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవటంతో వాళ్ల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ఆ ప్రభావం పార్టీ మీద పడుతోంది. ఇదే పరిస్థితి 2024 ఎన్నికల దాకా కొనసాగితే కష్టమని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి జగన్.. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పార్టీకీ అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలని కేడర్ కోరుతోంది.
ysrcp president ys jagan
చీరాల, కొడుమూరు, నందికొట్కూరు, జమ్మలమడుగు తదితర సెగ్మెంట్లలో పార్టీ బాధ్యులకు, ప్రజాప్రతినిధులకు మధ్య కోఆర్డినేషన్ కొరవడుతోంది. అధ్యక్షుడు జగన్ ఒకటీ రెండు నియోజకవర్గాల్లోని ఇలాంటి సమస్యలను దగ్గరుండి పరిష్కరించారు. మరికొన్నింటిని చక్కదిద్దాలంటూ పార్టీ పెద్దలను పురమాయించారు. వాళ్లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా దారికి రావట్లేదు. ఈ నేపథ్యంలో జగనే జోక్యం చేసుకోవాలని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పెద్ద సారు ఏం చేస్తారో ఏమో చూడాలి. అధికారం అనే గొడుగు కింద అవే సర్దుకుంటాయని లైట్ తీసుకుంటారా లేక పిలిపించి మాట్లాడతారా అనేది కాలమే చెప్పాలి. జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ పథకాల సమీక్షల్లో భాగంగా అధికారులతోపాటు శాసన సభ్యులతో మాట్లాడటం కాకుండా రెగ్యులర్ గా పార్టీ పనితీరునూ సమీక్షించాలని, శాసన సభ్యులు, పార్టీ ఇన్ఛార్జ్ లతో కూడా డైరెక్టుగా మాట్లాడాలని ఆశిస్తున్నారు. ఒకానొక సందర్భంలో జగన్ చంద్రబాబును విమర్శిస్తూ ఆయన జూమ్ కి దగ్గరగా, భూమికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జగన్ కూడా ప్రభుత్వానికి దగ్గరగా, పార్టీకి దూరంగా ఉన్నారనే బ్యాడ్ ఫీడ్ బ్యాక్ పొందకూడదనేదే అందరి సదుద్దేశం.
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
This website uses cookies.