Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం...!

Free Bus Scheme : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం అక్కడ బాగా సక్సెస్ అవడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా దానిని అమలు చేశారు. అయితే ఇక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ పథకాన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారాలలో దానిని కూడా చేర్చారు. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. కావున ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి జూన్ 12న అధికారంలోకి రావడం జరిగింది. అంటే కూటమి అధికారం సాధించి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాలు అమలుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం...!

Free Bus Scheme : ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. జులై 1 నుండి ఉచిత బస్సు ప్రయణ పథకం…!

దీంతో ఈ సమస్యలు రాకుండా ముందుగానే పరిష్కరించేందుకు దీనిపై దృష్టి సారించినట్లుగా రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. అయితే ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రధానంగా ఆటో డ్రైవర్లు తమకు గిరాకీ రావట్లేదని ఆందోళనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున దానికి ప్రత్యమ్నయంగా మరోపక్కని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు. అలాగే ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రానికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని తెలిపారు. తద్వారా ప్రతినెల 90 నుంచి 100 కోట్ల వరకు భారంపడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. అయినప్పటికీ ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో జూలై 1 నుంచి దీనిని అమలు చేయబోతుందని తెలుస్తోంది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి