Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త..!
Farmers : భారత ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఈ దిశగా 2025 మే 28న కేంద్ర మంత్రివర్గం మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (MISS)ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించింది. ముఖ్యంగా రైతులకు అందుతున్న రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత బలాన్నిచ్చేలా నిర్ణయం తీసుకుంది. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడం, పంటల ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యాలు.
Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త..!
1998లో ప్రారంభమైన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు సకాలంలో, తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడంలో ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. 2019లో ఈ పథకంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద రంగాల రైతులను కూడా చేర్చారు. ఈ విభాగాల రైతులు రూ.2 లక్షల వరకు పూచీకత్తులేని రుణాలను పొందే అవకాశం ఉంది. పంటలు నాటి కోతదాకా, అలాగే పంట తర్వాత నిల్వ, రవాణా వంటి ఖర్చులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం లభిస్తోంది.
MISS పథకం కింద ఏడాదికి 7% వడ్డీ రేటుతో రైతులకు రుణాలు లభిస్తాయి. కానీ సకాలంలో రుణం తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3% రాయితీ అందించి వడ్డీ రేటును 4%కి తగ్గిస్తున్నారు. ఈ విధంగా రైతులకు ఆర్థిక ఒత్తిడి తక్కువవుతుంది. అలాగే, 2023లో ప్రారంభించిన కిసాన్ రిన్ పోర్టల్ (KRP) వడ్డీ రాయితీ మరియు రీపేమెంట్ ప్రోత్సాహకాల క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి, బ్యాంకులు, RBI, NABARD మధ్య సమన్వయం సులభతరం చేసింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దాదాపు 5.9 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. 2025 బడ్జెట్లో తీసుకున్న తాజా నిర్ణయాలు 7.7 కోట్ల మందికి మేలు చేసేలా ఉండటం విశేషం.
Mibot Ev Car : జపాన్ కంపెనీ మిబోట్ పేరుతో మార్కెట్లో కొత్త కారుని లాంచ్ చేయబోతుంది. హిరోషిమా సమీపంలోని…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…
Chiranjeevi Anil Ravipudi : చిరంజీవి నయనతార కాంబినేషన్ లో అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.…
Bank Loan : ఇల్లు, విద్య, వాహనం లేదా వ్యక్తిగత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల నుండి రుణాలు…
Hardik Pandya Vs Shubman Gill : ఐపీఎల్ IPL 2025 అంటేనే ఒక్కొక్కరిలో కసి అలా తన్నుకొచ్చేస్తూ ఉంటుంది.…
Liver Detox : శరీరంలో ముఖ్యమైన అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో అలాగే కాలేయం కూడా అంత ముఖ్యమైన అవయవం.…
R Narayana Murthy : పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి థియేటర్ల సమస్యలపై స్పందిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల…
శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 20 పరుగులు తేడాతో పరాజయం కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్…
This website uses cookies.