Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం లను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే జగన్ పాలన ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చన్నారు. అమరావతిలో జరిగిన “సంవిధాన్ హత్య దివస్” కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో అత్యవసర పరిస్థితులు విధించబడిన జూన్ 25వ తేదీకి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో, చంద్రబాబు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తుచేశారు. అలాగే, ఆ కాలంలో ప్రజాస్వామ్యం ఎలా నాశనమైందో వివరిస్తూ, ఏపీలో గత ఐదేళ్ల పాలన కూడా దానికి సరిపోలే చీకటి పాలనగా అభివర్ణించారు.
Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం లను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో
“నా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను. కానీ జగన్ లాంటి పాలకుడిని ఎప్పుడూ చూడలేదు” అంటూ విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలు, ప్రజా హక్కుల నిరాకరణ, భూకబ్జాలు, ప్రశ్నించే వాణిని అణిచివేత వంటి అరాచకాలను జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. తనకు ఎదురైన సమస్యలు, మిత్రుడు పవన్ కళ్యాణ్కు తట్టుకున్న అవమానాలను కూడా గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం రక్షణ కోసం తాము పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.
ఎమర్జెన్సీ అనేది చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని, అది ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తుందో చూపించే ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ప్రజల వద్ద ఉన్న ఓటు హక్కే అంబేడ్కర్ అందించిన శక్తివంతమైన ఆయుధమని, మంచి పాలనను ఎంచుకోవడమే ప్రజల బాధ్యత అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి, తిరిగి గెలుపొందిన సందర్భాన్ని ఉదాహరించి ప్రజాస్వామ్యానికి ప్రజలే రక్షకులని చెప్పారు. తాము ఇప్పుడు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు దేశాన్ని, రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…
This website uses cookies.