Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిని చనిపోయినట్టుగా ప్రకటించి కుటుంబం సంప్రదాయ ఆచారాలను నిర్వహించింది. ఆమె తల్లి, మేనమామ సహా కుటుంబ సభ్యుల చర్యలపై తీవ్ర చర్చ న‌డుస్తుంది.

Parents బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు ఎందుకో తెలుసా

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents బ్రతికుండగానే క‌ర్మ‌..

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ యువతికి కుటుంబ సభ్యులు ఒక సంబంధం ఖరారు చేశారు. ఆమె నిరాకరించింది. కుటుంబంతో తీవ్ర వాగ్వాదాలు జరగగా, ఆ యువతి ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వేరే చోట వివాహం చేసుకుంది.ఈ వ్యవహారం జరిగిన 12 రోజుల తరువాత యువతి కుటుంబ సభ్యులు ఆమెను “సమాజపరంగా చనిపోయినట్లుగా” భావించి సంప్రదాయ హిందూ కర్మలను నిర్వహించారు.

పూజారి ఆధ్వర్యంలో ఆమె ఫోటోకు పూలమాల వేసి శ్రద్ధకర్మలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు తలలు గుండు కొట్టించుకుని, ఆమె వ్యక్తిగత వస్తువులను తగలబెట్టారు.యువతి మేనమామ సోమనాథ్ బిశ్వాస్ మాట్లాడుతూ, మేము ఆమెకు మంచి సంబంధం చూశాం. పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నాం. కానీ మా మాట వినకుండా, చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మాకు నష్టమవటమే కాదు, పరువు కూడా పోయింది అని తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది