pawan kalyan comments on tdp and janasena alliance
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా టీడీపీ, జనసేన పొత్తుపై మరోసారి స్పందించారు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన తోటి పక్కన ఉండే వాళ్లతో కూడా మనకు కలుపుగోలు తనం లేకపోతే ఎలా? నాకు ప్రత్యేకించి కులాల ఐక్యత అని పెట్టడానికి కీలకంగా ఆలోచించాను. కులాలుగా మనం విడిపోతున్నాం. ఏ పార్టీ కూడా ఒక కులాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయం చేసుకోవడం లేదు. టీడీపీ కావచ్చు.. వైసీపీ కావచ్చు.. ఏ పార్టీ కూడా కులాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాన్ని నడపడం లేదు. అన్ని కులాలకు మనం చేయాలి. అన్ని వర్గాలకు చేయాలి. ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతస్తులకు, కులాలకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలి. మీరు ఇది అవగాహన లేకపోతే వైసీపీ ట్రాప్ లో పడిపోతారు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. మీరు డిబేట్స్ కు వెళ్లినా.. ఎక్కడ వెళ్లినా కులానికి మోసం చేస్తున్నాం అంటారు వైసీపీ వాళ్లు. నేను మానవత్వం అన్న భావనతో వచ్చిన వాడిని. నిజంగా మానవత్వం ఉన్నవాళ్లు అన్ని కులాలను సమానంగా చూస్తారు. ఒక్క కులాన్నే పట్టుకొని వెళ్తే అప్పుడు వాళ్లు కుల నాయకులు అవుతారు అంటూ పవన్ చెప్పుకొచ్చారు.
ఓడిపోయినప్పుడు ఎవరు నిలబడతారు అనేది ముఖ్యం. అంతపెద్ద ఉవ్వెత్తున లేచిన పొలిటికల్ ప్రస్థానం ఎందుకు ఆగిపోయింది అంటే.. ఓటమి సమయంలో అందరూ వదిలేశారు. కానీ.. ఓటమి సమయంలో నాకు మీరంతా 2008 లో నిలబడి ఉన్నారు. అందుకే మనోహర్ అంటే నాకు అంత గౌరవం. చాలామంది వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోగానే అందరూ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కోరుకునేది ఏంటంటే.. రెండు పార్లమెంట్ సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు కేంద్రంలో కూర్చొంటే.. మీకు ప్రయాణం చేయడానికి ముందు ఓపిక లేదు. అందుకే వాళ్లకు ఏం చెప్పలేదు. పార్టీలో ఎవరైనా వెళ్తానంటే దయచేసి నేను ఎవ్వరినీ ఆపను. నాకు ప్రజలే ముఖ్యం. నా భావనను అర్థం చేసుకునే నాయకులు ఉంటే.. ఖచ్చితంగా నన్ను నాయకులే అర్థం చేసుకుంటారు. పెట్టుబడి పెట్టింది నేను.. నిలబడింది నేను.. దెబ్బలు తిన్నది నేను. అవమానం తిన్నది నేను. నాతో నిలబడ్డ జనసైనికులు.. వీర మహిళలు.. నా మీద ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుడిని కాదు.. అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
నాకు తన మన భేదం లేదు. నేను అనుకున్న గోల్ ను సాధిస్తాను. ఏంటి నా గోల్. ఏపీ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితుల్లో ఉండకూడదు. అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు. 2014 లో టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశానో చెబుతాను. నేను ఒక మాట చెబితే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగేలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి. భవిష్యత్తు తాలుకు ఏపీ పరిస్థితిని అగమ్యగోచరం చేసింది. ఏపీ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనం పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే.. మనకి విడిపోయినా కూడా ఏపీకి న్యాయం జరిగి ఉండేదేమో అని భావన వచ్చేది. అందుకే నేను టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చాను. గతంలో ఒక తప్పు జరిగింది.. ఎందుకు అంటే.. ఒక పార్టీని నడపలేకపోయాం అని అనుకున్నాం. ఆఖరి ప్రాణం వరకు పార్టీని తీయకూడదు. గెలుస్తామా లేదా అనేది పక్కన పెడితే బరిలో నిలబడి ఉండాలి.. అంటూ టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.