Categories: Newspolitics

Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

Advertisement
Advertisement

Revanth Reddy : గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ Telangana రాజ‌కీయాలు  చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప‌దేళ్ల పాటు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్.. రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి Revanth Ressy.. కేసీఆర్‌కి మూడు చెరువుల నీళ్లు తాగించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. కేసీఆర్. మూడు అక్షరాల ఈ పదం ఓ సంచలనం. అతడే ఓ సైన్యం కొన్నాళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన మాత్రం మౌనం వీడలేదు. దీంతో క్యాడర్ డీలా పడిపోతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ BRS పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే దండుగా కదిలే వారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వాయిస్ వినిపించకపోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి.

Advertisement

Revanth Reddy : కేసీఆర్‌కి చుక్క‌లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. చివ‌రికి ఏం జ‌ర‌గ‌నుంది..!

Revanth Reddy రేవంత్ రెడ్డి స‌రికొత్త స్కెచ్..

కేసీఆర్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కురిపించే వారు క‌రువ‌య్యారు. కేసీఆర్‌ KCR అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ సూచనలు తమకు అవసరమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి రావాల‌ని కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు కాంగ్రెస్ మంత్రులు. అయినా కేసీఆర్‌ ఫామహౌస్‌ దాటలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా బయటకు వచ్చింది లేదు. మైక్ పట్టింది లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాలి తుంటికి గాయం కావడంతో రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్. గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే.. కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందంటూ నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల Parliament elections ప్రచారంలో బిజీగా గడిపారు

Advertisement

ఇప్పుడు కేసీఆర్ కొడుకు అరెస్ట్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది. కేటీఆర్, హరీశ్‌రావును కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారన్న చర్చ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. ఇప్పుడైన కేసీఆర్‌ ఫాంహౌస్‌ వీడతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ రాకుంటే క్యాడర్‌ చీలిపోయే ప్రమాదం ఉంది. పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా, పలువురు ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ Phone Tapping చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం.

Recent Posts

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘మన వరప్రసాద్ ‘.. అది మెగా రేంజ్ అంటే..!

Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…

14 minutes ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie : సంక్రాంతి టైములో ఎంత దారుణమైన కలెక్షన్ల ..? ఏంటి రవితేజ ఇది ?

Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…

41 minutes ago

Ys Jagan Jr Ntr : 2029 ఎన్నికల్లో జగన్-ఎన్టీఆర్ లను కలిపేది అతడేనా..?

Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…

6 hours ago

Indian Army Jobs : భారత సైన్యంలో పెద్ద ఎత్తున జాబ్స్..అప్లై చేసుకోవడమే ఆలస్యం !!

Indian Army Jobs  :  భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…

7 hours ago

Today Gold Rate 16 January 2026 : పండగ రోజు కూడా సామాన్యులకు షాక్ ఇచ్చిన బంగారం ధర

Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…

7 hours ago

Chiranjeevi : జనసేన నుండి రాజ్యసభ కు చిరంజీవి..? ఇది నిజమవుతుందా ?

Chiranjeevi  : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…

8 hours ago

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన ప్రభుత్వం

తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' శరవేగంగా దూసుకుపోతోంది.…

9 hours ago

Elinati Remedies Pisces : మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం.. జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Elinati Remedies Pisces : శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి…

10 hours ago