Gruha Jyothi Scheme : గుడ్‌న్యూస్‌.. 200 యూనిట్ల ఫ్రీ క‌రెంట్ వాళ్లకు మాత్రమే… కండిషన్స్ ఇవే…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 13 January 2024, 7:00 pm
  •  Gruha Jyothi Scheme : గుడ్‌న్యూస్‌.. 200 యూనిట్ల ఫ్రీ క‌రెంట్ వాళ్లకు మాత్రమే... కండిషన్స్ ఇవే...!

Gruha Jyothi Scheme : విద్యుత్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమగ్రంగా అధ్యయనం చేసి శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమర్పించారు. అందిరిత్తో కలిసి నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ వినియోగం 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సంస్థల ఉత్పత్తి కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 200 యూనిట్లనో అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం స్కీం పనితీరు ఆర్థిక పరిస్థితి పైన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు ఆ ఒప్పందంలోని అంశాలు విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటి వాటి సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి వివరాలను అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరాలనే సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ఆరోగ్యానికి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ వివరంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎన్నికల్లో ఇచ్చిన గృహ జ్యోతి పథకానికి 200 యూనిట్లనో అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం స్కీం పనితీరు ఆర్థిక పరిస్థితి పైన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే ఈ స్కీం.. వినియోగం 200 యూనిట్లు దాటితే మొత్తానికి బిల్లు చెల్లించాల్సిందే అని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి. నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. ఇక అర్హులైన వారు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. సోషల్ మీడియాలో గైడ్లైన్స్ కూడా వైరల్ అవుతుంది. గృహజ్యోతికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వబోయే అంశానికి సంబంధించి స్కీమ్ సంబంధించి కొన్ని విధి విధానాలు కోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి