Virat Kohli : విరాట్ కోహ్లీ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Virat Kohli : విరాట్ కోహ్లీ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు..!!

Virat Kohli : ఆసియా కప్ టోర్నీలో శనివారం శ్రీలంకలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయ్యి 266 పరుగులు చేయడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ రెండో బ్యాటింగ్ కి దిగాల్సిన సమయంలో జోరుగా వర్షం పడటంతో.. ఎక్కడ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరుజట్లకు చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :4 September 2023,9:00 am

Virat Kohli : ఆసియా కప్ టోర్నీలో శనివారం శ్రీలంకలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 48.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయ్యి 266 పరుగులు చేయడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ రెండో బ్యాటింగ్ కి దిగాల్సిన సమయంలో జోరుగా వర్షం పడటంతో.. ఎక్కడ తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరుజట్లకు చెరో పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంలో కింగ్ కోహ్లీ భయపడ్డాడు అని పాక్ అభిమానులు.. భయంకరంగా ట్రోల్ చేయడం జరిగింది.

దీనికి కారణం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒకే ఒక్క రియాక్షన్. పాకిస్తాన్ తో మ్యాచ్ ప్రారంభంలోనే బ్యాటింగ్ కి దిగిన భారత్ కీలక బ్యాట్స్ మ్యాన్ లు వరుసగా అవుట్ అయిపోయారు. చాలా వరకు సింగిల్ ఫిగర్ తోనే స్టార్ ఫియర్ వెనక్కి జరగటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. స్టార్టింగ్ లోనే ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తర్వాత విరాట్ కోహ్లీనీ పాకిస్తాన్ స్పీడ్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది అవుట్ చేయడం జరిగింది. షాహిన్ వేసిన బంతులకు.. భారత్ బ్యాటర్లు తడబడి పోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ ఒకే ఒక్క పరుగు చేసి పెబిలియన్ చేరుకున్నాడు.

pakistani cricket fans Trolling on virat kohli

Virat Kohli : విరాట్ కోహ్లీ పై నోరు పారేసుకున్న పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు..!!

ఈ నేపథ్యంలో షాహిన్ వేసిన ఓ బాల్.. రోహిత్ శర్మ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో అధర్ ఎండ్ లో ఉన్న కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్ కోహ్లీ భయపడ్డాడు అంటూ ఆ ఫోటోని మరియు వీడియోని ట్యాగ్ చేసి పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పాకిస్తాన్ బౌలర్లు.. భారత్ బ్యాట్స్ మ్యాన్ లు బెంబేలెత్తి ఇచ్చారు అని కామెంట్లు చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది