EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్పై క్లారిటీ..!
ప్రధానాంశాలు:
ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్పై క్లారిటీ..!
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను తక్కువ డౌన్ పేమెంట్తో సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయడం యువతలో ట్రెండ్గా మారింది. అయితే ఈఎంఐలు చెల్లించకుండా డిఫాల్ట్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో రుణ సంస్థలు కొత్త మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. EMI చెల్లింపులు నిలిచిపోతే సంబంధిత స్మార్ట్ఫోన్ను రిమోట్ ద్వారా లాక్ చేసే విధానానికి అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనపై ఆర్బీఐ చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ ప్రతిపాదన ప్రకారం, ఫోన్ను పూర్తిగా పనిచేయకుండా చేయకుండా కొన్ని పరిమితులు మాత్రమే విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్స్, ఇంటర్నెట్, అత్యవసర సేవలు వంటి కీలక ఫీచర్లు అందుబాటులో ఉండేలా మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని సమాచారం. అయితే రుణగ్రహీత వరుసగా 90 రోజుల పాటు EMI చెల్లించకపోతే మాత్రమే ఈ చర్య అమలులోకి రావచ్చని తెలుస్తోంది. అంతకుముందు రెండు దఫాలుగా నోటీసులు పంపించాల్సి ఉంటుందని ప్రతిపాదిత నిబంధనల్లో పేర్కొన్నట్లు వార్తలు వెల్లడించాయి.
EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్పై క్లారిటీ..!
EMI ఈఎంఐ డిఫాల్ట్లపై కఠిన చర్యలకు ఆర్బీఐ సిద్ధమా?
చిన్న మొత్తాల వినియోగ రుణాల్లో డిఫాల్ట్లు పెరుగుతున్న నేపథ్యంలో రుణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ₹1 లక్ష లోపు మొబైల్ ఫోన్ రుణాల్లో బకాయిలు అధికంగా ఉన్నాయని ఆర్థిక రంగ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు ఫైనాన్స్ కంపెనీలు ఇప్పటికే కొన్ని సాంకేతిక పరిష్కారాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పించే దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఇప్పటికే ప్రత్యేక యాప్ల ద్వారా ఫోన్లను ట్రాక్ చేయడం లేదా లాక్ చేసే వ్యవస్థలను అమలు చేస్తున్నాయని సోషల్ మీడియా, రెడిట్ వేదికల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై స్పష్టమైన నియంత్రణలు అవసరమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
EMI వినియోగదారుల గోప్యతపై ఆందోళనలు
ఈ ప్రతిపాదనపై వినియోగదారుల హక్కుల సంఘాలు, టెక్నాలజీ నిపుణులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ యాప్లు, డిజిటల్ పేమెంట్లు, అధికారిక పత్రాలు వంటి కీలక డేటా ఉంటుందని, ఫోన్ లాక్ వ్యవస్థ దుర్వినియోగానికి దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఫోన్పైనే ఆధారపడే కుటుంబాలకు ఇది ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే ఆర్బీఐ ప్రతిపాదనలో వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయరాదని, వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన నిబంధనలు ఉండే అవకాశముందని సమాచారం. EMI బకాయిలు పూర్తిగా చెల్లించిన వెంటనే ఫోన్ను తిరిగి యాక్టివ్ చేయాల్సి ఉంటుందని కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు చెబుతున్నాయి.ఇప్పటికైతే ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు స్వీకరించిన తర్వాతే తుది మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దేశంలో డిజిటల్ రుణ వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.