GST : జూలై నుండి అమలు కానున్న కొత్త రూల్స్.. గడువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుదరదు
ప్రధానాంశాలు:
GST : జూలై నుండి అమలు కానున్న కొత్త రూల్స్.. గడువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుదరదు
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. జులై నుంచి ట్యాక్స్ టైం అంటే జులై నెలకు సంబంధించి రిటర్నులు ఆగస్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. వాస్తవ గడువు తేదీ నుంచి మూడేళ్ల సమయం దాటినట్లయితే జీఎస్టీఆర్- 1, జీఎస్టీఆర్ 3బీ, జీఎస్టీఆర్ 4, జీఎస్టీఆర్ 5, జీఎస్టీఆర్ 5ఏ, జీఎస్టీఆర్ 6, జీఎస్టీఆర్ 7, జీఎస్టీఆర్ 8, జీఎస్టీఆర్ 9 లు ఫైలింగ్ చేసేందుకు అవకాశం ఉండదని వస్తు సేవల పన్ను నెట్వర్క్ తెలిపింది.

GST : జూలై నుండి అమలు కానున్న కొత్త రూల్స్.. గడువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుదరదు
GST : ఆలస్యం చేయకండి..
జులై 2025 పన్ను కాలం నుంచి జీఎస్టీ పోర్టల్లో ఈ కొత్త పరిమితులు అమలు చేయబడతాయి.’ అని అడ్వైజరీలో స్పష్టం చేసింది గత ఏడాది 2024 అక్టోబర్ నెలలోనే ట్యాక్స్ పేయర్లను అలర్ట్ చేసింది జీఎస్టీ నెట్వర్క్. 2025 తొలినాళ్లలోనే జీఎస్టీ రిటర్నుల కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని, రిటర్నులు ఫైలింగ్కు టైమ్ లిమిట్ విధిస్తున్నట్లు హెచ్చరించింది.
వస్తు సేవల పన్నును జులై 1, 2017లో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చినట్లయింది. అయితే, కొంత గందరగోళం నెలకొన్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతుంటారు. ఆ తర్వాత చాలా మార్పులు చేస్తూ వచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని తెలుస్తోంది. 12 శాతం పన్ను శ్లాబును ఎత్తివేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.