BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

 Authored By ramu | The Telugu News | Updated on :19 March 2025,4:58 pm

ప్రధానాంశాలు:

  •  BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు - బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs  : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండిన పంటలతో వచ్చి ఆందోళనకు దిగారు. ఇది ప్రకృతి కారణంగా వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు నష్టం కలిగించడమే కాకుండా, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి పాపం – రైతన్నలకు శాపం” అంటూ నినాదాలు చేశారు.

BRS MLAs ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs : ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs అసెంబ్లీ లో ఎండిన పొలాలతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న దృశ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు బిఆర్ఎస్ నేతలు ఎండిన పంటలతో అసెంబ్లీకి వచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పట్ల ఉన్న ద్వేషంతోనే ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, నీటిని అదుపుగా వదలక పోవడంతోనే పంటలు ఎండిపోయాయని విమర్శించారు.

రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, ఎకరానికి రూ.25,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రైతులకు సకాలంలో నీటి సరఫరా చేయాలని, వారికి రుణ మాఫీ సహా ఇతర లబ్ధిదాయక పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను పట్టించుకోవడం మానేసి, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు న్యాయసహాయం చేస్తోందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది