Dilsukhnagar : దిల్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
ప్రధానాంశాలు:
Dilsukhnagar : దిల్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
Dilsukhnagar : దేశం మొత్తాన్నీ వణికించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనకి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అయిదుమంది దోషులకు మరణశిక్ష విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. అయిదుమంది దోషులకు 2016 డిసెంబర్ 13వ తేదీన మరణశిక్ష విధించింది.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం.

Dilsukhnagar : దిల్నగర్ బాంబు పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
Dilsukhnagar తీర్పుపై హర్షం..
శిక్ష పడిన వారిలో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వాఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
సుమారు 12 ఏళ్ల క్రితం దిల్సుఖ్ నగర్ సెంటర్లో టిఫిన్ బాంబ్స్ అమర్చడంతో 18మంది చనిపోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడి కాళ్లు, చేతులతో పాటు శరీర అవయవాలు కోల్పోయారు.ఈకేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 3016లోనే దోషులకు మరణశిక్ష విధించింది. అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును సమర్ధిస్తూ నేడు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. తీర్పుపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.