Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్స్ అఫ్ ఇండియా మేడిపల్లి మండల కమిటీ ఎన్నిక..!
ప్రధానాంశాలు:
అధ్యక్షుడిగా కూరెళ్ల ఉపేందర్ , ప్రధాన కార్యదర్శిగా వావిలాల చంద్రశేఖర్
Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్స్ అఫ్ ఇండియా మేడిపల్లి మండల కమిటీ ఎన్నిక..!
Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ కుమార్ తదితరుల పర్యవేక్షణలో మేడిపల్లి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సభ్యుల ఏకాభిప్రాయం మేరకు మేడిపల్లి మండల అధ్యక్షుడిగా కూరెళ్ళ ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా వావిలాల చంద్రశేఖర్, కోశాధికారిగ శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరితో పాటు ఉపాధ్యక్షులుగా చంద్ర శేఖర్, సురేష్ చౌదరి, సంయుక్త కార్యదర్శిగా నందీశ్వర్,కార్యనిర్వాహక కార్యదర్శిగా వెంకన్న ఎన్నికయ్యారు. శంకరాచారి,ప్రవీణ్,నరేందర్, కిరణ్ నాయక్, ఎంఎస్ జార్జ్, ప్రకాష్, రత్నకుమార్,దీపక్, కృష్ణ, ఎల్లేష్ తదితరులు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని అభినందించిన రాష్ట్ర కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించారు.