Telangana Assembly : వర్షాకాల తెలంగాణ అసెంబ్లీలో వైయస్సార్ ఇంకా జగన్ పేర్ల ప్రస్తావన..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 7 August 2023, 12:00 pm

Telangana Assembly : ప్రస్తుతం తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారంతో ముఖియనున్న అసెంబ్లీ సమావేశాలలో శనివారం మూడో రోజు ఆసక్తికరమైన ప్రస్తావన సభలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐటి సహా ఎన్నో భారీ పాత్రలు రాష్ట్రానికి తరలిరావడం ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అణిచివేస్తామని అన్నారు. తెలంగాణలో పటిష్టమైన శాంతిభద్రతల సుస్థిర వ్యవస్థ ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తన ప్రసంగంలో ప్రస్తావించారు. దిశా సంఘటనను చోటు చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు తీసుకుని నిర్ణయాలను సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో అభినందించారని… సీఎం కేసీఆర్ కి నిండు సభలో జగన్ సెల్యూట్ చేసినట్లు పేర్కొన్నారు.

mention of ysr and jagan names in telangana assembly

mention of ysr and jagan names in telangana assembly

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిలలో కొందరు తెలంగాణకు మంచి పనులు చేశారని.. వైయస్సార్ ఆరోగ్యశ్రీ అమలు చేశారని కొన్ని లక్షలది మందికి ఉపయోగపడిందని.. అభినందించారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ విప్ప తెలంగాణలో లేదని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి