minister uttam kumar reddy talks about kaleshwaram project
Uttam Kumar Reddy : తెలంగాణలో వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చాలా రోజుల నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్ని వేల కోట్లు పెట్టి నిర్మిస్తే ఎందుకు అంత నాసిరకంగా కట్టడాలు ఉన్నాయి. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు ఇలా ఉంటాయా? అంటూ ఓవైపు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కొత్త ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మంత్రి కాగానే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. డిటెయిల్ వివరణ అడిగాం. దాని మీద ఎంత నష్టం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నాం అన్నారు మంత్రి ఉత్తమ్.
ప్రతి ప్రాజెక్ట్ కొత్త ఆయకట్టుకు సంబంధించిన వివరాలు కావాలని అధికారులను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కొత్త ఆయకట్టు గురించి, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కాస్ట్, పవర్ కాస్ట్ ఎంత పడుతోంది. కోట్లాది మంది ప్రజల నమ్మకం, వాళ్ల కష్టంతో కడుతున్నాం. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావద్దు.. అని అధికారులు ఉత్తమ్ తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త వహించాలని.. సొరంగం పనులపై కూడా అడిగాం. వాళ్లకు జయప్రకాష్ కంపెనీకి, ఫండ్స్ ఇవ్వనందుకు ప్రాజెక్ట్ పనులు పూర్తిగా ఆగిపోయాయి అని చెప్పారు. నేను వెంటనే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి పనులు మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కాళేశ్వరంపై కేబినేట్ లేవల్ లో విచారణ చేయిస్తాం. చుట్టు పక్కన అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధం ఉండేలా చూసుకుంటాం. అలాగే ముందుకు వెళ్తాం. పోలింగ్ డే రోజే నాగార్జున సాగర్ వివాదం తెరమీదికి వచ్చింది. చాలా ప్రాజెక్టులకు ఎంత ఖర్చు అయింది. ఎంత ఆయకట్టు ఉంది.. అనే దానిపై డీప్ గా ఫిగర్స్ నాకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర పురోగతిలో ఇరిగేషన్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. డిటెయిల్ గా ప్రాజెక్ట్ వారీగా రివ్యూ కూడా ఉంటుంది అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.