Uttam Kumar Reddy : తెలంగాణలో వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని చాలా రోజుల నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అన్ని వేల కోట్లు పెట్టి నిర్మిస్తే ఎందుకు అంత నాసిరకంగా కట్టడాలు ఉన్నాయి. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు ఇలా ఉంటాయా? అంటూ ఓవైపు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. కొత్త ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మంత్రి కాగానే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే అధికారులను అడిగి తెలుసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. డిటెయిల్ వివరణ అడిగాం. దాని మీద ఎంత నష్టం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నాం అన్నారు మంత్రి ఉత్తమ్.
ప్రతి ప్రాజెక్ట్ కొత్త ఆయకట్టుకు సంబంధించిన వివరాలు కావాలని అధికారులను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కొత్త ఆయకట్టు గురించి, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రాజెక్టు కాస్ట్, పవర్ కాస్ట్ ఎంత పడుతోంది. కోట్లాది మంది ప్రజల నమ్మకం, వాళ్ల కష్టంతో కడుతున్నాం. ఒక్క రూపాయి కూడా వేస్ట్ కావద్దు.. అని అధికారులు ఉత్తమ్ తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త వహించాలని.. సొరంగం పనులపై కూడా అడిగాం. వాళ్లకు జయప్రకాష్ కంపెనీకి, ఫండ్స్ ఇవ్వనందుకు ప్రాజెక్ట్ పనులు పూర్తిగా ఆగిపోయాయి అని చెప్పారు. నేను వెంటనే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి పనులు మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కాళేశ్వరంపై కేబినేట్ లేవల్ లో విచారణ చేయిస్తాం. చుట్టు పక్కన అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధం ఉండేలా చూసుకుంటాం. అలాగే ముందుకు వెళ్తాం. పోలింగ్ డే రోజే నాగార్జున సాగర్ వివాదం తెరమీదికి వచ్చింది. చాలా ప్రాజెక్టులకు ఎంత ఖర్చు అయింది. ఎంత ఆయకట్టు ఉంది.. అనే దానిపై డీప్ గా ఫిగర్స్ నాకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర పురోగతిలో ఇరిగేషన్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. డిటెయిల్ గా ప్రాజెక్ట్ వారీగా రివ్యూ కూడా ఉంటుంది అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.