
TRS
Trs Mp : రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.. బర్తరఫ్ కి గురైన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని రాజ్యసభ సభ్యుణ్ని చేసి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా కాషాయం పార్టీతోపాటు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కి ఝలక్ ఇవ్వాలని చూస్తున్నారు. అదే సమయంలో కారు పార్టీకే చెందిన మరికొందరు ఈటల బాటలో నడవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక ఎంపీ బీజేపీలోకి జంప్ చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్లమెంట్ సభ్యుడి పేరు బీబీ పాటిల్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీ. అయితే తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీబీ పాటిల్ ఇవాళ శనివారం సీరియస్ గా స్పందించారు.
తన గురించి ఈవిధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటానని బీబీ పాటిల్ హెచ్చరించారు. పనికిమాలినోళ్లు వేస్తున్న చిల్లర వేషాలివి అని మండిపడ్డారు. తుది శ్వాస విడిచే వరకు గులాబీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలకి, తనకి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో, స్థానిక శాసన సభ్యుల సహకారంతోనే తాను రెండోసారి కూడా ఎంపీగా గెలిచానని అన్నారు. జహీరాబాద్ జనాలు తన పట్ల చూపుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు ఇలాంటి నీచానికి ఒడిగడుతున్నారని బీబీ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP
బీబీ పాటిల్ నిజంగానే బీజేపీలోకి వెళ్లడేమో గానీ పార్టీ మారే ముందు ప్రతి ఒక్క నాయకుడూ చెప్పే సెంటిమెంటల్ డైలాగ్ ఒకటుంది. ‘‘కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇదే పార్టీలో ఉంటా’’. ఈ మాట చెప్పారంటే వాళ్లు ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది ఇదే డైలాగ్ కొట్టి సొంత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈటల రాజేందర్ ని కేంద్ర మంత్రిని చేయబోతున్నట్లు చెబుతున్న బీజేపీ.. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఆయన భార్య జమునను బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
This website uses cookies.