Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  బిఆర్ఎస్ నేతలకు ఫోన్ టాపింగ్ కేసు.. పెద్ద తలనొప్పిగా మారిందా..?

  •  కాంగ్రెస్ సర్కార్ ఫోన్ టాపింగ్ కేసును వదిలేలా లేదు..!!

  •  Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిఘా విభాగం మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌ టార్గెట్‌اలో ప్రత్యర్థులే అని భావించినా, ఇప్పుడు స్వంత పార్టీ నేతలతో పాటు వారి సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలుస్తుంది.

Phone Tapping Case ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : ఫోన్ టాపింగ్ కేసు అగ్ర నేతలకు చిక్కుముడి కాబోతుందా..?

కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు, వ్యాపార సంబంధిత ఉద్యోగుల ఫోన్లపైనా నిఘా పెట్టినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈటల రాజేందర్ భార్య, బంధువులు, జమ్ము కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్‌లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థల ఉద్యోగులపై నిఘా పెట్టినట్లు గుర్తించారు. మొత్తం 4013 నంబర్లపై 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య నిఘా జరిగిందన్న నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది.

బీఆర్ఎస్ మాజీ నేతలతో పాటు పద్మా దేవేందర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, మర్రి జనార్ధన్ రావు లాంటి స్వంత పార్టీ నేతలపై కూడా ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడవుతోంది. ఇదే సమయంలో ఐఏఎస్ అధికారులు గౌతమ్, రొనాల్డ్ రాస్ లు కూడా ట్యాపింగ్ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది. అసలు ఈ వ్యవహారం ప్రభాకర్ రావు నిర్ణయంతో జరిగిందా లేక ఎవరైనా బలమైన ఆదేశాలతో చేశారా? అనే ప్రశ్నకు వచ్చే సమాధానం బీఆర్ఎస్ కీలక నేతల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది