Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. జూన్ 30న ఒకేసారి రైతుభరోసా నిధుల విడుదల!
ప్రధానాంశాలు:
Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. జూన్ 30న ఒకేసారి రైతుభరోసా నిధుల విడుదల!
Rythu Bharosa : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతులకు అందించే ‘రైతుభరోసా’ పెట్టుబడి సాయాన్ని ఈసారి ఒకేసారి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాధారణంగా విడతల వారీగా జమయ్యే నిధులు ఈసారి ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానుండటంతో సాగు పనులకు మరింత ఊతం లభించనుంది.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 30న నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. జూన్ 30న ఒకేసారి రైతుభరోసా నిధుల విడుదల!
Rythu Bharosa : జూన్ 30న రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున ‘రైతు ఆశీర్వాద సభ’ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై రైతుల ఖాతాల్లో నేరుగా రైతుభరోసా నిధులను జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. సంవత్సరంలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు మొత్తం రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.రైతులకు సాగు సమయంలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. రైతులపై ఆర్థిక భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు.ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుభరోసా అమలు ప్రక్రియ పారదర్శకంగా, అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Rythu Bharosa రైతుభరోసా పొందాలంటే ఇవి తప్పనిసరి.. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు
రైతుభరోసా నిధులను పొందాలంటే ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని కీలక నిబంధనలను రైతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ నెల 15వ తేదీ నాటికి రైతుల భూమి వివరాలు ‘భూభారతి’ పోర్టల్లో నమోదు అయి ఉండాలి. అంతేకాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ (CCLA) నుంచి సంబంధిత అనుమతులు కూడా పొందిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది.అలాగే ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాలు కలిగిన గిరిజన రైతులు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొందినట్లయితే మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు.
అర్హులైన రైతుల జాబితాను ఈ నెల 30 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఒక్క జిల్లా పరిధిలోనే సుమారు 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండనున్నారని అధికారులు వెల్లడించారు. ఈ రైతులకు నిధుల విడుదల కోసం దాదాపు రూ.460 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. అదనంగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది రైతులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్లు సమాచారం.ఇక రాబోయే వ్యవసాయ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మొబైల్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకున్న వెంటనే రైతులకు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వ్యవసాయ అవసరాలన్నింటినీ ప్రభుత్వం సమకూర్చేందుకు కట్టుబడి ఉందన్నారు.అదే సమయంలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతుభరోసా పథకం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







