Summer Holidays 2026 : విద్యార్ధులకు శుభవార్త .. బడులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

 Authored By sudheer | The Telugu News | Updated on :9 April 2026,10:30 am

ప్రధానాంశాలు:

  •  Summer Holidays 2026 : విద్యార్ధులకు శుభవార్త .. బడులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Summer Holidays 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు వేడి తీవ్రతకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే ఒంటి పూట బడులను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం విద్యార్థులు ఉదయం 8 గంటలకే పాఠశాలలకు చేరుకుని మధ్యాహ్న భోజనం అనంతరం 12.30 గంటలకే ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. ఈ చర్యలతో కొంతమేరకు విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Telangana Government Announces Summer Holidays for Schools

Telangana Government Announces Summer Holidays for Schools

Summer Holidays 2026 : వేసవి సెలవుల షెడ్యూల్‌పై స్పష్టత

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రభుత్వం వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా నిర్ణయించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవగా మూల్యాంకన ప్రక్రియ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 16తో ముగియనున్నాయి. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు తుది పరీక్షలు త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ నెల నాలుగో వారానికి అన్ని పరీక్షలు పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డులను అందజేయనున్నారు.

Summer Holidays 2026 : తల్లిదండ్రుల సన్నాహాలు .. పాఠశాలలకు సూచనలు

ఏప్రిల్ 23న చివరి పని దినం సందర్భంగా పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రగతిపై చర్చించనున్నారు. అనంతరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ నిర్ణయం నేపథ్యంలో తల్లిదండ్రులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ముందుగానే ట్రైన్, బస్సు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు సెలవులకు ముందే సిలబస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు సూచించింది. అవసరమైతే వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇలా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండింటినీ సమతుల్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి