KCR : ఒకే నిమిషంలో సీఎం పదవికి రిజైన్ చేస్తా.. బీజేపీకి కేసీఆర్ చాలెంజ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

KCR : ఒకే నిమిషంలో సీఎం పదవికి రిజైన్ చేస్తా.. బీజేపీకి కేసీఆర్ చాలెంజ్

KCR : వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందించారు. KCR : తెలంగాణ కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానన్న కేసీఆర్.. గొర్ల పైసలు కేంద్రంలోని బీజేపీనే ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిస్సిగ్గుగా మాట్లాడాడని కేసీఆర్ విమర్శించారు. కేంద్రమే కనుక […]

 Authored By praveen | The Telugu News | Updated on :8 November 2021,4:55 pm

KCR : వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందించారు.

telangana cm kcr huzurabad by elction trs party

telangana cm kcr huzurabad by elction trs party

KCR : తెలంగాణ కోసం ఎన్నో సార్లు రాజీనామా చేశానన్న కేసీఆర్..

గొర్ల పైసలు కేంద్రంలోని బీజేపీనే ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిస్సిగ్గుగా మాట్లాడాడని కేసీఆర్ విమర్శించారు. కేంద్రమే కనుక గొర్లపైసలు ఇచ్చి ఉంటే తాను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ కోసం తాను చాలాసార్లు రాజీనామా చేసి మళ్లీ గెలిచానని గుర్తు చేశారు కేసీఆర్. గొర్ల పథకం బీజేపీదే అయితే కర్నాటకలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బండి సంజయ్‌ను కేసీఆర్ హెచ్చరించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి జీహెచ్‌ఎంసీలో ఆ మాత్రం గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క జిల్లా పరిషత్ అయినా బీజేపీ గెలిచిందా అని అడుగుతూ ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది