nandamuri mokshajna workouts start for tollywood entry
Nandamuri mokshagna : నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ సంపాదించుకున్న వారిలో హీరో బాలకృష్ణ మరియు జూనియర్ తారక్ మాత్రమే నిలిచారు. బాలయ్య బాబు, ఎన్టీఆర్ సినిమాలు విడుదల అయ్యారంటే చాలు నందమూరి ఫ్యాన్స్ పెద్ద పండగే.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. తారక్ అన్న కళ్యాణ్ రామ్, మరో నటుడు తారకరత్న లాంటి వారు కనిపించడం లేదు.
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరపై కనిపించనున్నాడని కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ.. 2021లోనే బాలయ్య తనయుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలి. కానీ అందుకు తను ఇంకా సిద్ధం కాలేదని బాలయ్య పలుమార్లు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఆ టైం రానే వచ్చింది. ఇప్పటికే మోక్షజ్ఞకు 27 సంవత్సరాలు వచ్చాయి. బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీయార్ బాలనటులుగా వెండితెరపై కనిపించారు. మోక్షజ్ఞ ఇప్పటికే చాలా ఆలస్యం చేశాడని అనేవారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.
nandamuri mokshajna workouts start for tollywood entry
అయితే, 2022లో ఎలాగైనా తన కొడుకును నందమూరి అభిమానులకు పరిచయం చేయాలని బాలయ్య బాబు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన కుమారుడికి బాలయ్య చాలా టైం ఇచ్చారట.. ఇంకా లేట్ చేస్తే అభిమానుల్లో నిరాశ, అనాసక్తి పెరిగే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలుస్తోంది. యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే సరికి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోగలమని తనయుడికి బాలయ్య బాబు హితోపదేశం చేశారట.. అందుకే దగ్గరుండ మరీ మోక్షజ్ఞతో వర్కౌట్స్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు ఇండస్ట్రీలోకి రావడం ఖాయంగా తెలుస్తోంది.
OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…
SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…
ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
This website uses cookies.