Latest News : ప్రియుడుతో కలిసి భర్తను చంపి తలను నదిలో పడేసి మొండాన్ని..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :26 April 2023,12:00 pm

Latest News : ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. కొన్ని నిమిషాల సుఖాల కోసం క్షణికాలావేశంతో రక్త సంబంధాలు తెంచుకోవడానికి బరితెగించేస్తున్నారు. దీంతో పిల్లల జీవితాలు రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల కంటే అనుమానలు కారణంగా గొడవలు పెరిగిపోయి… జీవితాలు సమస్యలు వలయంలో చిక్కుకుంటున్నాయి. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉండటంతో మూడో వ్యక్తి రావటంతో అక్రమ సంబంధాలకు…

భార్యాభర్తల గొడవలు కారణమవుతున్నాయి.ఇదంతా పక్కన పెడితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ట్రనిక పట్టణంలో 50 సంవత్సరాల వయసున్న రాజేష్ మొదటి భార్య చనిపోవడం జరిగింది. అతనికి పెళ్లిడు వయసొచ్చిన కూతురు ఉంది. అయితే ఆ కూతురికి తల్లి లేని లోటు తీర్చాలని కోరిక కలిగిందో ఏమో తెలియదు కానీ రాజేష్ భవిత అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే భవిత అనే అమ్మాయికి పెళ్లి ముందు లేకపోతే తర్వాత తెలియదు గాని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. రాజేష్ తో పెళ్లి అయినా గాని అక్రమ సంబంధాన్ని భవిత కొనసాగిస్తూనే వచ్చింది.

She kiled her husband along with her boyfriend and threw his head in the river

She kiled her husband along with her boyfriend and threw his head in the river

అయితే రాజేష్ తన ఆస్తిలో కొంత భాగాన్ని భవిత పేరిట రాయగా మిగతాది కూతురికి రాయాలని నిశ్చయించుకోక భవిత ఈ విషయం తెలుసుకొని… ప్రియుడితో కలిసి రాజేష్ ని విచక్షణ రహితంగా బండరాయితో మొద్ధి చంపేయడం జరిగింది. ఆ తర్వాత తల మొండెం వేరుచేసి నదిలో పడేశారు. ఆ తర్వాత తన భర్త కనబడటం లేదని భవిత ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అయితే రాజేష్ కూతురికి భవిత పై అనుమానం రావటంతో పోలీస్ కేసు పెట్టడంతో పోలీసు విచారణ చేయటంతో మొత్తం విషయం బయటపడింది.

https://youtu.be/XF4H9eMdlyI

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి