Viral Video : ఊరి నడిబొడ్డులో ఉన్న కాలువలో డబ్బు కట్టలు ఒక్కసారిగా ఎగబడ్డ జనం వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 7 May 2023, 9:00 pm

Viral Video : బీహార్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ససారం జిల్లా మొరాదాబాద్ అనే ఊరు ఉంది. ఆ ఊరు నడిబొడ్డులో ఓ కాలువ ఉంది. ఎప్పుడు ఆ కాలువ నీటితో పారుతూ ఉంటది. అయితే అనుకోకుండా ఆ కాలువలో వంద రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్ల కట్టలు కుప్పలు తేప్పలుగా… కొట్టుకొచ్చాయి. దీంతో ముందు ఊరి జనం అవి నకిలీ నోటులని భావించారు. అయితే కొంతమంది వాటిని ఒరిజినల్ అని…

పట్టుకునే ప్రయత్నాలు చేయటంతో ఇంతలా వార్త ఓరి మొత్తం వ్యాపించడంతో స్థానికులు… ఎల్లో నుండి బ్యాంకులు తెచ్చుకుని మరి…. కాలువల్లోకి దూకి నోట్లు కట్టలు దక్కించుకున్నారు. ఇంకొందరు వారి చొక్యాలను విప్పి దొరికిన నోట్ల కట్టలను వాటిలో పెట్టుకున్నారు. ఎవరికి దొరికినంత వాళ్లు పోగేసుకుని.. ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అయితే చాలా సమయం తర్వాత విషయం పోలీసులు దాకా వెళ్ళింది.

video of a crowd suddenly throwing money in the canal in the heart of the village

video of a crowd suddenly throwing money in the canal in the heart of the village

వెంటనే వాళ్లు ఘటన స్థలానికి చేరుకుని కరెన్సీ నోట్లు ఎటు నుండి వచ్చాయి అన్నదానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు. స్థానికులు మాత్రం ఈ ఘటనపై నోరు విప్పటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పారే నీటిలో ఏ వైపు నుండి ఈ డబ్బు నోట్ల కట్టలు వచ్చాయి. అసలు ఎవరు నోట్ల కట్టలు కాలువల్లో పడేశారు..? అసలు అవి నిజమైన నోట్లేనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి