Viral News : తెలివిగా భర్తను అమ్మేసిన భార్య.. అచ్చం శుభలగ్నం సినిమాలాగానే ..!

Authored By aruna | The Telugu News | Updated on : 26 October 2023, 9:00 pm

Viral News : కర్ణాటకలోని మాన్య అనే గ్రామంలో భార్యాభర్తలు ఉండేవారు. భర్త ఏ పని చేయకుండా ఫుల్లుగా తాగేవాడు.దీంతో భార్య కుటుంబాన్ని పోషించేది. అయితే 40 ఏళ్ల మహిళ అదే గ్రామంలో వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉండేది. అయితే ఆ మహిళ వద్ద వడ్డీకి తీసుకున్నారు ఈ భార్యాభర్తలు. అయితే ఆ మహిళకి భర్తపై కన్ను పడింది. మంచి వయసులో ఉన్నాడు కవ్వించి వల వేసుకుంది. వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ కోరిక తీర్చమని చెప్పింది. దీంతో భర్త ఆమె ఇంట్లోనే ఉంటూ సంసారం మొదలుపెట్టాడు. దీంతో భార్య తన భర్త అక్రమ సంబంధాన్ని ఊహించలేకపోయింది.

భూమి అమ్మి అయినా అప్పు తీర్చమని ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని హెచ్చరించింది. దీంతో భర్త వినకుండా ఆమెను కొట్టేవాడు. దీంతో భార్య సదరు మహిళతో గొడవ పెట్టుకుంది. అయితే ఓ రోజు భార్య ఊరు వెళుతున్నానని భర్తకు చెప్పింది. పిల్లల్ని కూడా పుట్టింటికి తీసుకు వెళ్ళింది. అయితే తన భర్త ఆ మహిళతో ఏం చేస్తాడో తెలిసి సాయంత్రం ఏడు గంటలకు వచ్చింది. దీంతో భర్త వడ్డీలరాణితో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బయట గడియ పెట్టి చుట్టుపక్కల వారిని పిలిచి రచ్చ చేసింది. దీంతో వడ్డీల రాణి వడ్డీ కోసమే ఇంటికి వచ్చానని పంచాయతీ పెట్టించింది. ప్రియుడిని ఇంటిలో వేసి బంధించింది. పెద్దల దగ్గర వారు తీసుకున్న ఐదు లక్షలు ఇవ్వమని అడిగింది.

నువ్వు నా మొగుడిని వాడుకుంటున్నావ్ వడ్డీ లేదు, డబ్బు లేదు అని వారించింది ఆ మహిళ. దీంతో వడ్డీల రాణి 5 లక్షలు కట్టమని పంచాయతీలో చెప్పింది. అయితే ఐదు లక్షలు కడితే కట్టు లేదంటే నీ భర్త నా దగ్గరే ఉంటాడు అని చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. దీంతో భార్య నా భర్తను నీ దగ్గరే ఉంచుకో ఇంకో ఐదు లక్షలు కట్నంగా ఇచ్చేయని చెప్పింది. దీంతో వడ్డీల రాణి ఎగిరి గంతేసింది. నాకు కూడా అదే కావాలి ఇంకో ఐదు లక్షలు నీకు వచ్చే వారంలోపు ఇస్తాను అని చెప్పింది. దీంతో ఊరి వారంతా ఇంత చండాలపు పరిష్కారం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. దీంతో వడ్డీల రాణి అతడు నా దగ్గరే ఉంటాడని ఇంకో ఐదు లక్షలు వారంలోపు ఇస్తానని అగ్రిమెంట్ రాయించింది. ఇక ఆమె తన భర్తను ఐదు లక్షలు అమ్ముకుంది.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి