Adilabad..దేశ అభివృద్ధిలో యూత్ పాత్ర కీలకం

Authored By praveen T | The Telugu News | Updated on : 23 September 2021, 2:32 pm

దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జిల్లాలోని కౌటల మండానికి చెందిన నాయకులు సూరన్న అన్నారు. యువత ప్రశ్నించాలని, పాలకులను నిలదీయాలని సూచించారు. అలా చేసినప్పుడే సొసైటీలో మార్పు సాధ్యమని అన్నారు. ఈ నేపథ్యంలోనే సూరన్న ‘పల్లె పల్లెకు సూరన్న’ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం కౌటల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పారు.

ఇకపోతే గ్రామాల్లో యువకులు యాక్టివ్‌గా ఉండి అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రశ్నించినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని, యువతీ యువకులకు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సత్తా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. యువతను చైతన్య పరిచేందుకుగాను తాను ఈ పల్లె పల్లెకు సూరన్న అనే ప్రోగ్రామ్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులకు ప్రశ్నించేతత్వం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Also read

praveen T

No bio available for this author.

  1. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  2. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  3. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  4. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  5. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

  6. "YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?"

  7. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp