Congress – BJP : ఏపీ ఫలితాలపై కాంగ్రెస్, బీజేపీ ఆశలు.. మళ్లీ పుంజుకునేందుకు వ్యూహాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Congress – BJP : ఏపీ ఫలితాలపై కాంగ్రెస్, బీజేపీ ఆశలు.. మళ్లీ పుంజుకునేందుకు వ్యూహాలు..!

Congress – BJP : ఇప్పుడు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏపీ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇందుకోసం రాబోయే ఫలితాలను ఆధారంగా మార్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఒక విధంగా, బీజేపీ వ్యూహం ఇంకో విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఏపీని శాసించింది. బలమైన పార్టీగా ఉండేది. అంతెందుకు ఇప్పుడు ఏపీలో వైసీపీ ఏర్పడింది కూడా కాంగ్రెస్ ఓట్ల మీదనే. కాబట్టి మరోసారి ఏపీలో బలంగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 May 2024,7:15 pm

Congress – BJP : ఇప్పుడు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏపీ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇందుకోసం రాబోయే ఫలితాలను ఆధారంగా మార్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఒక విధంగా, బీజేపీ వ్యూహం ఇంకో విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉమ్మడి ఏపీని శాసించింది. బలమైన పార్టీగా ఉండేది. అంతెందుకు ఇప్పుడు ఏపీలో వైసీపీ ఏర్పడింది కూడా కాంగ్రెస్ ఓట్ల మీదనే. కాబట్టి మరోసారి ఏపీలో బలంగా మారాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇటు తెలంగాణలో పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏపీపై దృష్టి పెడుతోంది.

టీడీపీతో మరో ప్లాన్..

ఏపీలో వైసీపీ ఓడిపోతే తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఎందుకంటే వైసీపీ ఓడిపోతే ఆ పార్టీలో ఉన్న నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే కాబట్టి తిరిగి తమ గూటికి వస్తారేమో అని ఆలోచిస్తోంది. పైగా ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి ఆమెను చూసి వైసీపీ నేతలు కాంగ్రెస్ బాట పడితే తిరిగి పుంజుకోవచ్చని అనుకుంటోంది. ఇక బీజేపీ ఆలోచన మరో విధంగా ఉంది. గతంలో 2019లో టీడీపీని దెబ్బ కొట్టి ఎదగాలని ఆశ పడింది. టీడీపీకి అయితే దెబ్బ పడింది గానీ బీజేపీ మాత్రం దారుణంగా ఓడిపోయంది. కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.

అయితే ఇప్పుడు మరో ప్లాన్ వేసింది బీజేపీ. ఇప్పుడు టీడీపీ, జనసేనతో పొత్తులు పెట్టుకుంది. ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వస్తే ఏపీ ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని అనుకుంటోంది. పైగా ఏపీ ప్రభుత్వంలో మూడు మంత్రి పదవులు ఆశిస్తోంది బీజేపీ. ఒకవేళ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాకపోతే తక్షణం బీజేపీ చేసే మరో పని ఏంటంటే జనసేనను విలీనం చేసుకోవడం. ఆ తర్వాత జనసేన బలంతో టీడీపీ నుంచి కూడా నేతలను చేర్చుకుని బలంగా మారాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఇలాంటి ప్లాన్ వేస్తోంది బీజేపీ. ఇలా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు ఏపీలో పట్టు సాధించేందుకు రెడీ అవుతున్నాయి. కానీ ఆ రెండు పార్టీలు లోకల్ పార్టీలను కాదని ఎలా ఎదుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది