Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలిపారు. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని వైరల్ అవుతోన్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Guntur Sp సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp  గుంటూరు ఎస్పీ క్లారిటీ..

ఆరోజు నాకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకే నేను చెప్పాను. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్లీ క్లారిటీ ఇస్తానని చెప్పాను. దర్యాప్తులో జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు తేలింది . మాజీ సీఎం జగన్, డ్రైవర్ సహా పలువురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం అని గుంటూరు ఎస్పీ స‌తీష్ కుమార్ తెలిపారు.

ఇక సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బీఎన్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని A1గా చేర్చారు. అలాగే వైఎస్ జగన్‌ను A2గా.. అలాగే ఆయనతో ఉన్న జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డిని A3గా, వైవీ సుబ్బారెడ్డిని A4గా, పేర్ని నానిని A5గా, విడదల రజినిని A6గా చేర్చారు. జగన్‌పై నమోదు చేసిన కేసులో బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్ హోమీసైడ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది