YS Sharmila : వై.యస్.షర్మిల మధ్యలో హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : వై.యస్.షర్మిల మధ్యలో హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ..??

YS Sharmila  : వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా పైన కాంగ్రెస్ పైన జగన్ తో పాటు షర్మిల కూడా విమర్శలు చేశారు.అన్నీ మర్చిపోయి షర్మిలను పార్టీలోకి హై కమాండ్ తీసుకుంది. అయితే ఏపీలో షర్మిల ఎంత బలంగా నిలబడతారు అనేదానిపై సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టి రాజకీయంగా నిలదొక్కుకోవడం కన్నా ఆస్తులు పంచాయతీని తేల్చుకోవడానికి అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో పోటీకి […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,8:00 pm

YS Sharmila  : వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా పైన కాంగ్రెస్ పైన జగన్ తో పాటు షర్మిల కూడా విమర్శలు చేశారు.అన్నీ మర్చిపోయి షర్మిలను పార్టీలోకి హై కమాండ్ తీసుకుంది. అయితే ఏపీలో షర్మిల ఎంత బలంగా నిలబడతారు అనేదానిపై సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టి రాజకీయంగా నిలదొక్కుకోవడం కన్నా ఆస్తులు పంచాయతీని తేల్చుకోవడానికి అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో పోటీకి వెనకడుగు వేసినట్లుగా ఏపీలో తన పంతం నెరవేరిందని మధ్యలో హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ కి చెడ్డ పేరు వస్తుంది. వై.యస్.షర్మిల రాజకీయాల్లోకి రావడానికి కారణం తన అన్నతో ఉన్న విభేదాలు అని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ప్రజల కు సంబంధం లేని అజెండాతో పార్టీ పెట్టుకుంటే తమ డిమాండ్ నెరవేరగానే మధ్యలో రాజకీయాలకు గుడ్ బై చెబుతారు. ఇప్పుడు షర్మిల విషయంలో ఇదే అనుమానాలు వస్తున్నాయి.

తెలంగాణలో షర్మిల వైయస్సార్ టీపీ పార్టీని పెట్టారు. పాదయాత్రలు చేశారు. సీఎం అవుతానని ఛాలెంజ్ లు చేశారు. కానీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఏపీ కాంగ్రెస్ ఆఫర్లు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తెలంగాణలో రాజకీయం చేస్తే ఆమెకు ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కానీ కాంగ్రెస్ను ఏపీలో బలపరుస్తాను అంటే మాత్రం అనేక ఒత్తిడి లు వస్తాయి. ముఖ్యంగా కుటుంబ ఒత్తిడిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏపీలో కాంగ్రెస్ బలహీన పడటానికి కారణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం కాదని వై.యస్.జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వలన కాంగ్రెస్ కనుమరుగైంది. కాంగ్రెస్ క్యాడర్లు నాయకులంతా వైసీపీలోకి చేరారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత స్థానిక సంస్థల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా దెబ్బతీసింది వై.యస్.జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడమే. ఇక ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఆమె కుటుంబ పరిస్థితుల వలన మధ్యలోనే రాజీ పడితే పరిస్థితి ఏంటి అనేది మరో అంశం. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు కూడా రావటం లేదని షర్మిల పార్టీ లోకి వస్తే కొన్ని వర్గాల తో పాటు కొంతమంది వలసనేతలు వస్తారని నమ్ముతున్నారు.

ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరుతానని చెప్పారు. వైసీపి టికెట్లు కసరత్తు పూర్తయిన తర్వాత టీడీపీ వైసీపీలో టికెట్లు దక్కని నేతలు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ బలపడితే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతుంది. ఈ క్రమంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండిపోరు. ఇప్పటినుంచి వైయస్ షర్మిల తో రాజీ పడేందుకు చూస్తున్నారు. కుటుంబ పరువు కోసం ఆమె రాజీ పడే అవకాశం ఉండవచ్చు. ఆస్తులు పంచితే షర్మిల సైలెంట్ అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తమకు నష్టం జరిగితే షర్మిలను పోటీ నుంచి దింపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తారు. ఆమె ఏ కారణంతో విభేదించారు, అన్ని షరతులను ఒప్పుకొని పోటీ నుంచి విరమింప చేయాలని అనుకుంటే కాంగ్రెస్ ను మళ్లీ చావు దెబ్బ కొట్టాలని అనుకుంటారు. ఇలాంటి ఒత్తిడిలను అధిగమించి కాంగ్రెస్ పార్టీ తను పెట్టుకున్న నమ్మకాన్ని వై.యస్.షర్మిల అందుకోవాల్సి ఉంది. ఒకవేళ వైయస్ షర్మిల హ్యాండ్ ఇస్తే వైయస్ కుటుంబం మరోసారి కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ కొట్టినట్లు అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది