New Medical Colleges in AP : ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలు.. ఎక్కడెక్కడో..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో పది కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కాలేజీల ఏర్పాటుతో వైద్య విద్యతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.

New Medical Colleges in AP
ఈ కొత్త మెడికల్ కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం RFP (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) జారీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ కాలేజీల నిర్మాణం రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో నాలుగు చోట్ల, రెండో దశలో మిగిలిన ఆరు చోట్ల వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు కొత్త మెడికల్ సీట్లు లభిస్తాయి. అంతే కాకుండా, వైద్య సిబ్బంది కొరత కూడా తీరుతుంది. ఈ చర్య ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.