Peddireddy Ramachandra Reddy : కూటమి సర్కార్ పై పెద్దిరెడ్డి విమర్శలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Peddireddy Ramachandra Reddy : కూటమి సర్కార్ పై పెద్దిరెడ్డి విమర్శలు

 Authored By ramu | The Telugu News | Updated on :12 March 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •   Peddireddy Ramachandra Reddy : కూటమి సర్కార్ పై పెద్దిరెడ్డి విమర్శలు

Peddireddy Ramachandra Reddy : ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటినీ అమలు చేయలేదని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఇంత దారుణమైన పరిపాలనను ఇప్పటి వరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అవసరమైన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, ఇది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టేనని ఆయన మండిపడ్డారు.

Peddireddy Ramachandra Reddy కూటమి సర్కార్ పై పెద్దిరెడ్డి విమర్శలు

Peddireddy Ramachandra Reddy : కూటమి సర్కార్ పై పెద్దిరెడ్డి విమర్శలు

కూటమి సర్కార్ ఏర్పడి ఇప్పటికే 10 నెలలు గడిచిపోయినా ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలను పూర్తిగా అడ్డుకున్న చంద్రబాబు, విద్యార్థులపై రూ.30 వేల బాకీ పడేలా చేసారని ఆరోపించారు. దీనివల్ల చాలా మంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వైసీపీ యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేపట్టింది. వివిధ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించి, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వైసీపీ యువత స్పష్టం చేసింది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు, విద్యాసంస్థలు కూడా తమ మద్దతు ఇవ్వాలని వైసీపీ యువనేతలు పిలుపునిచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది