Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా?

Vijayasai Reddy : ఇటీవ‌ల ప్ర‌తి రాష్ట్రంలో కూడా ఎన్నిక‌లు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌లు రంజుగా సాగ‌గా హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసారు. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా.. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశాక, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా?

Vijayasai Reddy : ఇటీవ‌ల ప్ర‌తి రాష్ట్రంలో కూడా ఎన్నిక‌లు చాలా ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ‌, ఏపీ ఎన్నిక‌లు రంజుగా సాగ‌గా హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసారు. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా.. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది. అలాగే జమ్మూకాశ్మీర్‌లో 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశాక, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. అందువల్ల ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా సాగింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్‌ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.

Vijayasai Reddy విజ‌య‌సాయి రెడ్డి పంచ్‌లు..

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. మొద‌ట్లో క‌నీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. 71 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. దీంతో ఈవీఎం ప‌ని తీరుపై అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి “ప్రపంచ బ్యాంకు జీతగాడు…చంద్రబాబు మోసగాడు”……అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుందని సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత “ఫార్మ్ 20” వెబ్ సైట్ లో పెట్టిందని…. పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు అంటూ చురకలు అంటించారు.

Vijayasai Reddy ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా

Vijayasai Reddy : ఏపీలో ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా.. అది మ‌ర‌ల్చ‌డానికే ల‌డ్డూ వివాద‌మా?

ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేసారన్నారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో మొదలెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ఆరోపణ‌లు చేశారు విజయ సాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది