YS Sharmila : తొలి స్పీచ్ లోనే జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల .. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : తొలి స్పీచ్ లోనే జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల .. వీడియో !

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.ఎస్.షర్మిల బాధ్యతలు చేపట్టారు. కానూరు లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : తొలి స్పీచ్ లోనే జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల ..!

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.ఎస్.షర్మిల బాధ్యతలు చేపట్టారు. కానూరు లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలు అయిన వచ్చాయా అని ప్రశ్నించారు. అప్పుల పైన నిలదీశారు. హోదా ఏమైంది జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ ఆశయ సాధన కోసం తాను సిద్ధమని తనతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

టీడీపీ, వైసీపీ పదేళ్ల పాలన గురించి వై.యస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో ఇద్దరి హయాంలో రాష్ట్రానికి అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క మెట్రో లేదని, చెప్పుకునే స్థాయిలో ఏ డెవలప్మెంట్ లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నారా అని నిలదీశారు. దళితుల పైన మాత్రం దాడులు 100% పెరిగాయి అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్, ఇసుక మాఫియా ఉందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు 15 ఏళ్లు స్టేటస్ కావాలని కోరారని అంశాన్ని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేశారన్నారు. స్వలాభం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ తాకట్టు పెట్టాయని విమర్శించారు.

హోదా లేదంటే ఆ పాపం చంద్రబాబు జగన్ దేనిని షర్మిల అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారని ఆరోపించారు. జగన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు. ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు. మరి ఏం సాధించారని నిలదీశారు. పోలవరంలో చంద్రబాబు జగన్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు బీజేపీకి ఎందుకు పొత్తులుగా మారారని నిలదీశారు. రెండు పార్టీలు బీజేపీ ఏం చెబితే దానికి గంగిరెద్దుల మారారని వ్యాఖ్యానించారు. ఒక్క అంశంలో అయిన టీడీపీ, వైసీపీ బీజేపీని వ్యతిరేకిచ్చిందా అని ప్రశ్నించారు. మణిపూర్ లో క్రైస్తవులపై, వివక్ష చర్చిలు కూల్చారని మండిపడ్డారు. బీజేపీతో వైసీపీ టీడీపీ పొత్తులు ఉన్నాయని ఆరోపించారు. వైయస్సార్ ఊపిరి ఆశలు కాంగ్రెస్ తోనేనని స్పష్టం చేశారు. వైయస్సార్ అభిమానులు చేతులు కలపాలని, వైయస్సార్ ఆశయాలను సాధించేందుకు తాను రెడీగా ఉన్నానని, మీరు రెడీనా అంటూ కార్యకర్తలకు షర్మిల పిలుపునిచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది