Hydroponics Farming : మట్టితో పనిలేకుండా వ్యవసాయం.. కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు మిత్రులు.. 35000 మందికి ట్రైనింగ్.. ‘హైడ్రోపోనిక్స్’ సక్సెస్ స్టోరీ ఇదే
ప్రధానాంశాలు:
Hydroponics Farming : మట్టితో పనిలేకుండా వ్యవసాయం.. కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు మిత్రులు.. 35000 మందికి ట్రైనింగ్.. 'హైడ్రోపోనిక్స్' సక్సెస్ స్టోరీ ఇదే
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ వ్యవసాయ పద్ధతులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు కేవలం ‘నీరు’, ఆధునిక పరిజ్ఞానం ఉంటే చాలు.. అద్భుతమైన పంటలు పండించవచ్చు. దీనినే ‘హైడ్రోపోనిక్స్’ Hydroponics లేదా మట్టి లేని వ్యవసాయం Soilless farming అంటారు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ను పట్టుకుని ముగ్గురు మిత్రులు అహ్మదాబాద్ కేంద్రంగా ‘రైజ్ హైడ్రోపోనిక్స్’ Rise Hydroponics అనే అగ్రిటెక్ స్టార్టప్ను స్థాపించి కోట్లు గడిస్తున్నారు. అంతేకాదు, ఏకంగా 35 వేల మందికి పైగా దీనిపై శిక్షణ ఇచ్చి వారితో లాభాలు ఆర్జించేలా చేస్తున్నారు. ఆ ముగ్గురు మిత్రుల సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
How to Start Hydroponics Farming : మట్టితో పనిలేకుండా వ్యవసాయం.. కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు మిత్రులు.. 35000 మందికి ట్రైనింగ్.. ‘హైడ్రోపోనిక్స్’ సక్సెస్ స్టోరీ ఇదే
Hydroponics Farmingఅసలు ఈ ఐడియా ఎలా వచ్చింది?
తుషార్ అగర్వాల్ Tusshar Aggarwal, మీట్ పటేల్ Meet Patel.. ఈ ఇద్దరూ 2016లో అహ్మదాబాద్లోని ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఎంబీఏ చేస్తున్నప్పుడు కలుసుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన మీట్ పటేల్కు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. తుషార్కు మాత్రం సమాజంలోని సమస్యలను పరిష్కరించే ఒక మంచి స్టార్టప్ పెట్టాలని ఉండేది. ఈ క్రమంలోనే వీరికి ఆహార భద్రత, నీటి కొరత, మట్టి సారం తగ్గిపోవడం వంటి సమస్యలకు ‘హైడ్రోపోనిక్స్’ విధానం సరైన పరిష్కారం అనిపించింది.
మొదటి రెండేళ్లు తమ ఇంటి పైకప్పు మీదే ఈ ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైడ్రోపోనిక్స్ ఆసక్తి ఉన్నవారితో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణంలో వారికి వ్యవసాయ రంగంలో అపార అనుభవం ఉన్న వివేక్ శుక్లా Vivek Shukla పరిచయం అయ్యాడు. అలా ఈ ముగ్గురూ కలిసి 2020లో ‘రైజ్ హైడ్రోపోనిక్స్’ స్టార్టప్ను ప్రారంభించారు.
How to Start Hydroponics Farming వీరి బిజినెస్ మోడల్ ఏంటి? ఎలా లాభాలు వస్తాయి?
ఈ స్టార్టప్ ప్రధానంగా మూడు రకాలుగా తమ సేవలను అందిస్తోంది.
ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్: ఆసక్తి, స్థలం ఉన్న వ్యక్తులకు వీరే స్వయంగా ఒక హైడ్రోపోనిక్స్ ఫామ్ను డిజైన్ చేసి ఇస్తారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఏడాది పాటు ఉచితంగా మెయింటెనెన్స్, అగ్రోనమీ సేవలు అందిస్తారు. ప్రారంభంలో రైతులు పండించిన పంటలో కొంత శాతాన్ని వీరే కొనుగోలు చేసి వారికి మార్కెటింగ్ భయం లేకుండా చేస్తారు.
జాయింట్ వెంచర్ మోడల్: వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాలని ఉన్నా.. సమయం లేని కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలతో వీరు ఒప్పందం చేసుకుంటారు. పెట్టుబడి, భూమి అవతలి వారు పెడితే.. మొత్తం నిర్వహణను రైజ్ హైడ్రోపోనిక్స్ చూసుకుంటుంది. వచ్చిన లాభాలను ఇరువర్గాలు పంచుకుంటాయి.
రిటైల్ మార్కెట్: తాము పండించిన కూరగాయలను ‘Rise Freshz – Direct from Farms’ అనే బ్రాండ్ పేరుతో నేరుగా అమ్ముతున్నారు. బిగ్బాస్కెట్ BigBasket, స్టార్ బజార్ లాంటి రిటైల్ చైన్స్తో పాటు హోటళ్లు, సూపర్ మార్కెట్లు, ఆయుర్వేద కంపెనీలకు కూడా వీరు సప్లై చేస్తున్నారు.
సాంకేతికత.. ప్రత్యేకతలు
సాధారణ వ్యవసాయంతో పోలిస్తే హైడ్రోపోనిక్స్ విధానంలో 80 శాతం నీరు ఆదా అవుతుంది. భూమి కూడా 85 శాతం తక్కువగా అవసరమవుతుంది. దిగుబడి మాత్రం 20-60 శాతం దాకా పెరుగుతుంది. వీరు న్యూట్రియెంట్ ఫిల్మ్ టెక్నిక్ NFT, డచ్ బకెట్స్, కోకోపీట్ వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
వీరి ప్రత్యేకత ఏమిటంటే.. వీరు సొంతంగా ‘RAFU’ Rise Automatic Fertigation Management Unit అనే సిస్టమ్ను డెవలప్ చేశారు. దీని ద్వారా ఎరువులు, నీరు ఎంత ఇవ్వాలి, టెంపరేచర్, హ్యుమిడిటీ ఎలా ఉందో అంతా ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేస్తుంది. మన ఫోన్లోని సాఫ్ట్వేర్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ ఫామ్ను కంట్రోల్ చేయవచ్చు. అహ్మదాబాద్లో వీరికి ఏకంగా 50,000 చదరపు అడుగుల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది.
27 నగరాలు.. 35 వేల మందికి ట్రైనింగ్!
తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు మేము భారతదేశంలోని 27 వివిధ నగరాల్లో 40కి పైగా భారీ కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేశాము. సుమారు 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మట్టి లేని వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేశాం. అంతేకాకుండా రైతులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, గృహిణులు ఇలా సుమారు 35,000 మందికి పైగా ఈ విధానంపై ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చాము” అని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని జేవార్లో ఏకంగా 15 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద హైడ్రోపోనిక్స్ ఫామ్ను జాయింట్ వెంచర్ విధానంలో వీరు నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని జల్గావ్లో 3 ఎకరాల్లో రూ.2.2 కోట్ల పెట్టుబడితో మరో ప్రాజెక్ట్ నడుపుతున్నారు. దీనికి నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ నుంచి రూ.70 లక్షల సబ్సిడీని కూడా ఇప్పించారు.
భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతం వీరి ఫామ్స్లో క్యాప్సికమ్, దోసకాయ, టొమాటో, బ్రోకలీ, పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలతో పాటు.. ఔషధ గుణాలున్న పసుపు, అశ్వగంధ, అల్లం, బ్రాహ్మి, తులసి వంటి 50 రకాల పంటలను పండిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్ల రెవెన్యూ సాధించిన ఈ స్టార్టప్, ఈ ఏడాది దానిని రూ.8 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. తమ కెపాసిటీని పెంచుకోవడానికి దాదాపు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) ఫండింగ్ కోసం ఈ ముగ్గురు మిత్రులు ప్రయత్నిస్తున్నారు.
ఆలోచన, దాన్ని అమలు చేసే విధానం సరైనది అయితే వ్యవసాయంలోనూ అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ‘రైజ్ హైడ్రోపోనిక్స్’ ఒక చక్కటి ఉదాహరణ.