Today Gold Price : ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2025,10:48 am

ప్రధానాంశాలు:

  •  ఈరోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..!

Today Gold Price : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.3,000 మేర పెరిగి రూ. 1,17,000కు చేరుకోవడం మార్కెట్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. గత కొంతకాలంగా బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతుండగా, తాజా ధరల పెరుగుదల దీనిని మరింత బలపరుస్తోంది. ఇది ఇటీవల కాలంలో వెండి ధరలో చోటుచేసుకున్న అతిపెద్ద పెరుగుదలగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .

Today Gold Price ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు కానీ వెండి ఏకంగా రూ 3 వేలు పెరిగింది

Today Gold Price : ఈ రోజు బంగారం ధరల్లో మార్పు లేదు.. కానీ వెండి ఏకంగా రూ. 3 వేలు పెరిగింది..!

Today Gold Price వెండి కూడా కొనే రోజులు లేనట్లే ఉంది. లక్ష 20 వేలకు చేరువలో వెండి ధర

ఇక బంగారం విషయానికి వస్తే.. మూడు రోజులుగా పెరుగుతూ వస్తుండగా.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ( పుత్తడి ) 10 గ్రాముల ధర రూ. 99,600 వద్ద స్థిరంగా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,300గా కొనసాగుతోంది .

ఆభరణాల కొనుగోలు దారులకు ఇది కొంత ఊరట కలిగించినా, వెండి ధర పెరుగుదల వినియోగదారులకు భారం అవుతోంది. పెరుగుతున్న అంతర్జాతీయ వెండి డిమాండ్, రూపాయి మారకపు విలువలో మార్పులు, మార్కెట్‌లో ముడిసరుకుల కొరత వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరికొన్ని రోజులు వెండి కొనుగోళ్లపై ప్రజలు కాస్త వెనుకంజ వేయవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది