Anchor Pradeep also leaving etv Dhee Show
Dhee Show : ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కు గత నాలుగైదు సంవత్సరాలుగా మంచి రేటింగ్ వస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ గా ప్రదీప్ టీం లీడర్ లుగా సుధీర్, రష్మీ, ఆది వంటి వారు ఉండటం వల్ల గత సీజన్ లకు అద్భుతమైన రేటింగ్ రావడం తో పాటు నిర్వాహకులకు మంచి ఆదాయం కూడా వచ్చిందని.. అంతే కాకుండా అందులో కంటెస్టెంట్స్ కి బయట మంచి పేరు కూడా దక్కిందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సారి మాత్రం కంటెస్టెంట్స్ కు మాత్రమే కాకుండా ఏ ఒక్కరికి కూడా పెద్దగా పేరు వచ్చే అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే షో కు ఏమాత్రం రేటింగ్ రావడం లేదు. దానికి ప్రధాన కారణం ఢీ ఈ సీజన్ నుండి సుధీర్ మరియు రష్మీ ల ను తొలగించడం జరిగింది.
ఆది కొనసాగుతున్నప్పటికీ ఆయనకు సరైన జోడి లేకపోవడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన అఖిల్ మరియు టీవీ నటుడు రవి కృష్ణ ఇంకా కొంత మంది ని తీసుకు వచ్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆది పై చెయ్యి సాధిస్తూ అఖిల్ మరియు రవి కృష్ణ లపై కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అఖిల్ ని దారుణంగా అవమానిస్తూ కామెడీ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి.అఖిల్ ఇలాంటి కామెడీ కి ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల్ ఈ షో లో మూడు నాళ్ళ ముచ్చట అన్నట్లుగా అయ్యింది.
akhil jump from etv dhee dance show he is now biggboss ott
అతడు బిగ్ బాస్ ఓటీటీ కి వెళ్లి పోయాడు. బయటకు వచ్చేసి ఇప్పటికే బిగ్బాస్ డిజిటల్ ప్లాట్ఫారంపై సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ ఓటీటీ లో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో రన్నరప్ గా నిలిచిన తను ఈసారి కచ్చితం గా విజేతగా బయటికి వెళ్తాను అంటూ ధీమాగా చెబుతున్నాడు. అఖిల్ కు పోటీ ఇచ్చేందుకు హౌస్ లో చాలా పెద్ద సంఖ్యలోనే జనాలు ఉన్నారు. అందుకే అఖిల్ఈ సారి టాప్ 5 వరకు రావడమే గొప్ప విషయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఢీ షోలో విఫలమైన అఖిల్ మరోసారి బిగ్బాస్ లో సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.