Nayanthara : స‌మంత ప‌రిస్థితే న‌య‌న‌తార‌కి ప‌డుతుంది.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన జ్యోతిష్కుడు

Authored By Sam C | The Telugu News | Published on: May 12, 2022, 5:30 pm

Nayanthara : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఎంతో ప్రాణంగా నాగ చైత‌న్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాని నాలుగేళ్ల‌కే విడాకులు ఇచ్చింది. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి న‌య‌న‌తార‌కి కూడా ప‌డుతుందంటున్నాడు వేణు స్వామి. సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి గతంలో తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ కు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని కూడా వేణు స్వామి తెలిపారు.

తాజాగా వేణు స్వామి స్వీటీ అనుష్క శెట్టి, రష్మిక వివాహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తుండడంతో ఈ జాతకాల గొడవ మళ్ళీ మొదలైంది.నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెళ్లి ఇవాళ‌, రేపు అన్న‌ట్టుగా మారింది. ఈ ఏడాది జూన్‌ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్‌-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నయనతార వైవాహిక జీవితంపై అస్ట్రాలజర్‌ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

astrology comments on Nayanthara marriage

astrology comments on Nayanthara marriage

Nayanthara : ఇవ‌న్నీ నిజాలేనా..!

నయన తారకు పెళ్లి అచ్చిరాదని, వివాహ అనంతరం తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని ఆయన అంటున్నారు.తన జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉ‍న్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే స్టార్‌ హీరోయిన్స్‌ అనుష్క శెట్టి, రష్మిక మందన్నాల గురించి కూడా చెప్పారు. వీరికి సైతం పెళ్లి జీవితం అచ్చి రాదని, వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఇక చివరగా సమంత, పూజ హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార సినీ కేరీర్‌ 2024 తర్వాత అంతమైపోతుందని ఆయన పేర్కొన్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp