Bigg Boss Telugu 8 : పాత కంటెస్టెంట్స్ టార్గెట్గా కొత్త కంటెస్టెంట్స్.. హౌజ్లో ఏం జరుగుతుంది..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 కోసం పాత కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్లోకి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వారి రాకతో ఇప్పుడు బిగ్ బాస్ లో రచ్చ మరోలా ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, హరితేజ, నయని పావని, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, రోహిణి బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అవినాష్, గంగవ్వ, రోహిణి, టేస్టీ […]
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : పాత కంటెస్టెంట్స్ టార్గెట్గా కొత్త కంటెస్టెంట్స్.. హౌజ్లో ఏం జరుగుతుంది..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 కోసం పాత కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్లోకి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వారి రాకతో ఇప్పుడు బిగ్ బాస్ లో రచ్చ మరోలా ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, హరితేజ, నయని పావని, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, రోహిణి బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అవినాష్, గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ, హరితేజలు వినోదాన్ని పంచడంలో ముందుంటారు. వీరి ద్వారా టాస్క్ లతో రచ్చ చేయించడంతోపాటు వినోదాన్ని కూడా పంచేందుకు ప్లాన్ చేశారట. ఇక ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో పాత కంటెస్టెంట్లని కొత్త కంటెస్టెంట్లు నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్.
వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లకి టైమ్ లేదు కాబట్టి వాళ్లని నామినేట్ చేయడానికి లేదని, అలాగే మెగా చీఫ్ అయిన నబీల్ని నామినేట్ చేయడానికి లేదు. ఈ క్రమంలో హరితేజ.. యష్మి, పృథ్వీరాజ్లను నామినేట్ చేసింది. నాగమణికంఠని వరుసగా నామినేట్ చేయడం, ఆయన్ని టార్గెట్ చేయడం బాగా లేదని చెప్పి నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ ని సైతం ఆమె నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణ వచ్చి.. విష్ణు ప్రియా, యష్మిలను నామినేట్ చేశాడు. తన గేమ్ పక్కన పెట్టి పక్కవారిపై ఫోకస్ పెడుతున్నావని విష్ణు ప్రియాని అన్నాడు గౌతమ్ కృష్ణ. అలాగే యష్మిని నామినేట్ చేస్తూ, రివేంజ్ నామినేషన్ నచ్చ లేదని తెలిపారు. నయని పావని.. విష్ణు ప్రియా, కిర్రాక్ సీతలను నామినేట్ చేసింది. మెహబూబ్.. కిర్రాక్ సీత, యష్మిలను నామినేట్ చేశాడు.
టేస్టీ తేజ.. కిర్రాక్ సీత, మణికంఠలను నామినేట్ చేశాడు. ఇప్పటి వరకు పెద్దగా సీత ఆట్ట పెద్దగా లేదని చెప్పాడు.అలాగే మణికంఠని నామినేట్ చేస్తూ అందరికి సమస్యలున్నాయి, చెప్పలేని బాధలున్నాయి. కానీ ఇక్కడ ఎవరూ చెప్పుకోరని, మనసులోనే దాచుకుంటారని, కానీ నువ్వు ప్రతి రోజు అదే సింపతి ప్లే చేస్తున్నావని, నీ ఆట తీరు ఫేక్గా ఉందని ఆరోపించారు. అయితే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు అంతా నాగమణికంఠ, యష్మిలను టార్గెట్ చేశారు. మణికంఠకి సింపతీ చూపిస్తూ యష్మిని టార్గెట్ చేస్తున్నారు. మణికంఠని బ్యాక్ టూ బ్యాక్ యష్మి నామినేట్ చేసిన నేపథ్యంలో అది సరైనది కాదని కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు చెబుతున్నారు.