Taraka Ratna : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచిన తర్వాత గుండె పోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తారకరత్నను స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ కు తరలించడం జరిగింది. అత్యంత ఖరీదైన వైద్యమును నారాయణ హృదయాలయ వారు తారకరత్నకు అందిస్తున్నట్లుగా నందమూరి మరియు నారా కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీ వారు తారకరత్న యొక్క చికిత్సకు పూర్తి ఖర్చులు భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్ యొక్క పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండె పోటుకు గురయ్యాడు. కనుక పూర్తి ఖర్చును తానే భరిస్తాను అన్నట్లుగా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారంట. ఈ విషయాన్ని తారకరత్న భార్యతో చంద్రబాబు నాయుడు తెలియజేసినట్లు తెలుస్తోంది. తారకరత్న ఇతర నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉంటాడట. అందుకు గాను చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా తారకరత్న యొక్క హాస్పిటల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయం. తారకరత్న యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త పరవాలేదు అన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. దాంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లి నారాయణ హృదయాలయాల్లో ఉన్న తారకరత్నను పరామర్శించిన విషయం తెలిసిందే.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.