Taraka Ratna : నందమూరి తారకరత్న మీద విష ప్రయోగం ?? బిత్తరపోయే నిజం బయటకి ?

 Authored By aruna | The Telugu News | Updated on :28 January 2023,5:20 pm

Taraka Ratna : ఏపీలో నందమూరి తారకరత్నకు చేదు సంఘటన ఎదురైంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఈరోజు యువ మంగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 11 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతోపాటు తారకరత్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనూ తారకరత్న యువ మంగళ పాదయాత్రలో అపశృతికి గురయ్యారు. సెకండ్స్ లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు వెంటనే తారకరత్నను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

poison experiment on Taraka Ratna

poison experiment on Taraka Ratna

చికిత్స అనంతరం ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో వెంటనే బెంగుళూరుకి తరలించారని తెలుస్తుంది. అయితే తారకరత్న స్పృహ తప్ప లేదని ఆయనపై విష ప్రయోగం జరిగిందని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. దీనికి కారణం ఆయన బాడీ నీలం రంగులోకి మారడం అని తెలుస్తుంది. యాత్ర ప్రారంభించేముందు తీర్థప్రసాదాలు తీసుకున్నారని ఆ కారణం గానే పల్స్ పడిపోయిందని, దాదాపు 45 నిమిషాల దాకా ఆయనకు పల్స్ అందలేదని, మళ్లీ ఆయనను యధావిధిగా తీసుకురావడానికి డాక్టర్స్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది.

poison experiment on Taraka Ratna

poison experiment on Taraka Ratna

అయితే నిజానికి ఈ కార్యక్రమంలో ఈ యాత్రలో పాల్గొనకూడదు. 48 గంటల ముందు ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగటం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. దీంతో కావాలనే ఎవరు ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. లోకేష్ పాద యాత్ర ప్రారంభించ తొలి రోజే ఇలా తారకరత్నకు విష ప్రయోగం జరగటం రాజకీయాలు సంచలనంగా మారింది. ఎవరో దగ్గర వాళ్లే తారకరత్న పై ఇలా విష ప్రయోగం చేశారని కొందరు అంటున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి