Hyper Aadi : కొత్త యాంకర్ ను లైన్లో పెట్టే పనిలో హైపర్ ఆది… సుడిగాలి సుధీర్ ను ఫాలో అవుతున్నాడా…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 13 November 2022, 1:00 pm

Hyper Aadi : జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే. అనసూయ ను రీప్లేస్ చేస్తూ ఆమె ప్లేస్ లో రష్మీని సౌమ్య రావు ను తీసుకువచ్చారు. సౌమ్యా రావు గత గురువారం ఎపిసోడ్ నుండే యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది. వచ్చిరాని తెలుగుతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందర్నీ ఆకర్షిస్తుంది సౌమ్య. ఇది ఇలా ఉండగా హైపర్ ఆది కొత్త యాంకర్ ను లైన్లో పెట్టేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆమె వచ్చి రాగానే ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచే పులిహోర కలుపుతున్నారు.
ఇక ఈ విషయం సౌమ్యకే అర్థమయిపోయింది. దీంతో సౌమ్య నువ్వు ఎంత పులిహోర కలిపినా నేను పడను అంటూ చెప్పేసింది. ఇటీవల నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా దానిలో సౌమ్యారావు షార్ట్ ఫ్రాక్ ధరించి కనిపించింది. దీంతో ఈమె కూడా మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లుగా అనిపిస్తుంది.

అయితే రష్మీ అనసూయ లకు ఆ రేంజ్ లో క్రేజ్ రావడానికి కారణం బాడీ షో అని చెప్పాలి.  ఏ తెలుగు యాంకర్లు చేయని సాహసం రష్మీ అనసూయ చేసి మంచి క్రేజ్ ను సాధించారు. అనసూయ అయితే బాడీ షో చూపించడంలో ఏమాత్రం ఆలోచించదు. తన అందాలను చూసినవారు ఎవరైనా ఆమెకు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు సంప్రదాయాలను పక్కన పెట్టేసి బుల్లితెర ప్రేక్షకులకు , మంచి గ్లామర్ ట్రేట్ ను ఇచ్చారు. ఇక అనసూయ ఎన్నోసార్లు తన బట్టల విషయం లో తీవ్ర విమర్శలు తలెత్తిన ఆమె ఏ మాత్రం తగ్గలేదు. తనకు నచ్చినట్లుగా చేస్తూ బాడీ షో తో మంచి క్రేజ్ ను సాధించి. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు వెండితెరపై వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది . మరి ఇప్పుడు ఆమె వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య కూడా మెల్లగా అదే పద్ధతులు అలవర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో సామ్య అలవైకుంఠపురం లోని బుట్ట బొమ్మ సాంగ్ కి షార్ట్ ఫ్రాక్ వేసుకొని ఇంటర్ ఇచ్చింది.

Hyper Aadi is in the process of putting the new anchor on line

Hyper Aadi is in the process of putting the new anchor on line

సాంగ్ అయిపోగానే…ఆది ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కదానివే డాన్స్ వేస్తే ఒట్టి బొమ్మ నాతోపాటు వేస్తే బుట్ట బొమ్మ అవుతుంది అని అన్నాడు. నువ్ ఎంత పులిహోర కలిపినా నేను నీకు పడనులే అని సౌమ్యా రావు అంటుంది. దానికి ఆది నేనెవరో తెలుసా? చిరంజీవి అభిమానిని అని అన్నారు. చిరంజీవి అయితే కాదు కదా అంటూ సౌమ్యరావు పంచ్ వేసింది . అయితే రష్మి వెంటపడి సుదీర్ తన కెరీర్ ని సెట్ చేసుకున్నాడు. బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు హైపర్ ఆది కూడా సుధీర్ ఫార్ములను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వచ్చి రాగానే యాంకర్ సౌమ్యను లైన్ లో పెట్టే పనిలో పడ్డాడు ఆది. ఇదిలా ఉండగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఒక్కొక్కరు మరల తిరిగి జబర్దస్త్ కు వస్తున్నారు. దీంతో జబర్దస్త్ కి మరల పూర్వవైభవం వస్తుందని జబర్దస్త్ మేకర్స్ భావిస్తున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి